కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది.

కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ ప్రమోషన్‌ను కంగనా ప్రారంభించింది. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా న‌టించింది. ఈ చిత్రం 1975లో విధించిన ఎమర్జెన్సీని ప్ర‌ధానాంశంగా తెర‌కెక్కడంతో మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా హైప్ కంటే ఎక్కువ వివాదాల బారిన పడుతుంది.

ఇండియా టుడే కథనం ప్రకారం.. 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలపై నిషేధం విధించాలని ఆస్ట్రేలియాకు చెందిన సిక్కు కౌన్సిల్ డిమాండ్ చేసింది. సినిమాలో చారిత్రాత్మక సంఘటనలు తప్పుగా చిత్రీకరించబడ్డాయని.. ఇది సిక్కు అమరవీరుల గౌరవానికి మచ్చగా మారవచ్చని కౌన్సిల్ అభిప్రాయపడింది. ఈ సినిమా సిక్కులు, హిందువుల మధ్య పెంచుతుందని అంటున్నారు.

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ చిత్రంలో ఆమె ప్రధాన నటి. సిక్కు కౌన్సిల్ ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది. ఈ సినిమా సిక్కు సమాజంలో శాంతికి విఘాతం కలిగిస్తుందని సిక్కు కౌన్సిల్ అంటోంది. 'ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించడం పట్ల మేము ఆందోళన చెందుతున్నాము. ఈ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హీరోగా చూపించారు. ఆమె వీరోచిత పాత్రను చూపించారు. సిక్కు అమరవీరులను అవమానకరమైన రీతిలో చిత్రీకరించారు. చారిత్రక సంఘటనలు కూడా తప్పు పద్ధతిలో చూపించబడ్డాయి. ఇది సిక్కు సమాజానికి పెద్ద సమస్య. ఈ సినిమా దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించగలదు. సిక్కు కమ్యూనిటీ నాయకుడు సంత్ జర్నైల్ సింగ్ ఖల్సా భింద్రన్‌వాలేను సినిమాలో నెగిటివ్ గా చూపించడం ఆందోళన కలిగించే విషయం అని పేర్కొంది.

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి సహా పలువురు తారలు నటిస్తున్నారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story