ముంబయ్(Mumbai) ఏయిర్ పోర్ట్ లో(Airport).. స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ కు(Shruti Haasan) చేదు అనుభవం ఎదురయ్యింది. అభినానినంటూ ఓ వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టాడు. వెంట పడుతూ.. హెరాజ్ చేయబోయాడు.

ముంబయ్(Mumbai) ఏయిర్ పోర్ట్ లో(Airport).. స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ కు(Shruti Haasan) చేదు అనుభవం ఎదురయ్యింది. అభినానినంటూ ఓ వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టాడు. వెంట పడుతూ.. హెరాజ్ చేయబోయాడు.

స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. దుబాయ్‌లో(Dubai) జరిగిన సైమా అవార్డుల(SIIMA Awards) వేడుకలకు వెళ్లి బాగా హడావిడి చేసింది శ్రుతి. ఇక అక్కడ కార్యక్రమానికి హాజరై ఇండియాకు తిరిగి వచ్చింది. ముంబయ్ ఎయిర్ పోర్ట్ లో దిగిని శ్రుతి హాసన్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఆమెను వెంబడించి భయపెట్టాడు. అభిమానిని అంటూ శ్రుతి హాసన్ ను ఫాలో చేశాడు. ఈ విషయం గుర్తించిన హీరోయిన్‌ తన ప్రియుడు శాంతనుతో కలిసి వేగంగా నడుచుకుంటూ ముందుకెళ్లింది.

మధ్యలో ఆగి ఎవరు నువ్వు? అని ప్రశ్నించడంతో అతను పక్కకి వెళ్లిపోయాడు. కానీ, మళ్లీ ఆమెనే ఫాలో అవుతూ కనిపించాడు. మీ అభిమానినంటూ.. ఆమె వెంట వెళ్తూ.. వెకిలినవ్వులు నవ్వుతూ.. చికాకుపెట్టించాడు. దాంతో ఆమె ఫాస్ట్ గా వెళ్లి తన కారు ఎక్కింది. పార్కింగ్‌లో ఆమె కారు ఎక్కేంత వరకూ వెంబడించాడు. కాస్త భయపడినట్టు కనిపించిన శ్రుతి హాసన్ నువ్వు ఎవరో నాకు తెలియదు? అంటూ గాబరా పడుతూ కారు ఎక్కేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. కాగా, టాలీవుడ్‌లో ఈ ఏడాది శృతీ హాసన్ రెండు సూపర్ హిట్లు అందుకుంది. సీనియర్ హీరోలు అయిన బాలయ్య బాబుతో పాటు చిరంజీవితో వరుసగా వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో మెప్పించింది. ఇప్పుడు ప్రభాస్ సరసన నటించిన ‘సలార్‌‌’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 28నే విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

Updated On 20 Sep 2023 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story