మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళా శంకర్‌(Bhola shankar) సినిమా ఇంత డిజాస్టర్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అనుకున్నదాని కంటే ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టిందా సినిమా! ఆచార్య సినిమానే పెద్ద ఫ్లాప్‌ అనుకుంటే అంతకు మించిన భారీ ఫ్లాప్‌గా భోళాశంకర్‌ నిలిచింది. ఇప్పుడు చిరంజీవికి ఓ పెద్ద హిట్‌ అవసరం. భోళాశంకర్‌ సినిమాకు వచ్చిన విమర్శలన్నీ దాంతో తుడిచిపెట్టుకుపోవాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ సినిమా అలరించాలి. ఇందుకోసం చిరంజీవి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బింబిసార దర్శకుడు వశిష్టను(Vasista) లైన్‌లో పెట్టాడు.

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) నటించిన భోళా శంకర్‌(Bhola shankar) సినిమా ఇంత డిజాస్టర్‌ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అనుకున్నదాని కంటే ఎక్కువ నష్టాలే తెచ్చిపెట్టిందా సినిమా! ఆచార్య సినిమానే పెద్ద ఫ్లాప్‌ అనుకుంటే అంతకు మించిన భారీ ఫ్లాప్‌గా భోళాశంకర్‌ నిలిచింది. ఇప్పుడు చిరంజీవికి ఓ పెద్ద హిట్‌ అవసరం. భోళాశంకర్‌ సినిమాకు వచ్చిన విమర్శలన్నీ దాంతో తుడిచిపెట్టుకుపోవాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆ సినిమా అలరించాలి. ఇందుకోసం చిరంజీవి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బింబిసార దర్శకుడు వశిష్టను(Vasista) లైన్‌లో పెట్టాడు. బింబిసార తర్వాత దాని సీక్వెల్‌ను తెరకెక్కించాలని అనుకున్న వశిష్ట ఇప్పుడు ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి చిరంజీవి సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు(First Look Poster) బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వచ్చింది. పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ సినిమాపై తిరుగులేని ఆసక్తిని క్రియేట్‌ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్‌ సోషల్‌ మీడియాను చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందట. అంతేకాకుండా దాదాపు నలుగురు హీరోయిన్‌లు సినిమా కోసం పనిచేయనున్నారట. అందులో అనుష్క షెట్టి(Anushka Shetty), మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) దాదాపుగా కన్ఫర్మ్‌ అయిపోయారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకంటున్న ఈ సినిమా ఇదే ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూటింగ్‌ మొదలు పెట్టనుంది.యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించనున్నాడు. చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించి దాదాపు మూడు దశాబ్దాలు అవుతుంది.1994లో వచ్చిన ఎస్‌.పి.పరశురామ్‌ సినిమా తర్వాత చిరంజీవి-కీరవాణి కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరు కలిశారు. ఇక ఈ సినిమాకు ముందు కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తయిపోయినట్లు సమాచారం. చిరంజీవి పెద్ద కూతరు సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలను నెలల గ్యాప్‌లోనే రిలీజ్‌ చేసుకునే విధంగా షూటింగ్‌ను ప్లాన్‌ చేసుకుంటున్నాడట చిరంజీవి.

Updated On 18 Sep 2023 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story