సిద్ధు జొన్నలగడ్డ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాస్టియర్‌ వచ్చిన డీజే టిల్లు సినిమాతో ఫ్యాన్స్‌ను పెంచుకున్నాడు సిద్ధు. ఆ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కలెక్షన్లను కూడా ఓ రేంజ్‌లో సాధించింది. డీజే టిల్లులో మాటలు, వాటిని సిద్ధు పలికిన తీరు అభిమానులకు తెగ నచ్చేశాయి. ఇప్పుడు సిద్ధు అంతకు డబుల్‌ ట్రిపుల్‌ వినోదాలను పంచడానికి రెడీ అయ్యాడు. టిల్లు స్క్వేర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

సిద్ధు జొన్నలగడ్డ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాస్టియర్‌ వచ్చిన డీజే టిల్లు(DJ Tillu) సినిమాతో ఫ్యాన్స్‌ను పెంచుకున్నాడు సిద్ధు. ఆ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కలెక్షన్లను కూడా ఓ రేంజ్‌లో సాధించింది. డీజే టిల్లులో మాటలు, వాటిని సిద్ధు పలికిన తీరు అభిమానులకు తెగ నచ్చేశాయి. ఇప్పుడు సిద్ధు అంతకు డబుల్‌ ట్రిపుల్‌ వినోదాలను పంచడానికి రెడీ అయ్యాడు. టిల్లు స్క్వేర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈ సందర్భంగా విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ పోస్టర్‌లో సిద్ధు - అనుపమ రొమాంటిక్‌ లుక్‌లో కనిపించారు. ఫస్ట్‌ పార్ట్‌ను మించిన వినోదాన్ని, థ్రిల్‌ను ఈ రెండో భాగం అందిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ సినిమాకి రామ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Updated On 6 Jun 2023 1:00 AM GMT
Ehatv

Ehatv

Next Story