యాంకర్‌ అనసూయ(Anchor Anasuya) అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనేకానేక టీవీ షోలతో అనసూయ షార్ట్‌ పిరియడ్‌లోనే టాప్‌ యాంకర్‌గా ఎదిగారు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా ఓ వీడియో షేర్‌ చేసి అభిమానులకు షాకిచ్చారు.

యాంకర్‌ అనసూయ(Anchor Anasuya) అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనేకానేక టీవీ షోలతో అనసూయ షార్ట్‌ పిరియడ్‌లోనే టాప్‌ యాంకర్‌గా ఎదిగారు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సోషల్‌ మీడియాలో ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. రీసెంట్‌గా ఓ వీడియో షేర్‌ చేసి అభిమానులకు షాకిచ్చారు. ఆ వీడియోలో ఆమె బోరున విలపిస్తూ కనిపించారు. దీంతో అనసూయకు ఏమైందోనని ఫ్యాన్స్‌ కంగారుపడ్డారు. ఆరా తీసి అసలు విషయం తెలుసుకున్నారు. తీరా సోషల్‌ మీడియా నెగెటివిటీ గురించే అని అంతా అనుకున్నారు. కానీ మరో వీడియో రిలీజ్‌ చేసిన అనసూయ...

మీరు ఇలా అర్థం చేసుకున్నారా? అంటూ క్లారిటీ ఇచ్చుకున్నారు. ఆ వీడియోలో తాను ఏడ్చింది సోషల్‌ మీడియా నెగెటివిటీపై ఏ మాత్రం కాదని, తాను తీసుకున్న ఓ నిర్ణయం వల్లనేనని చెప్పుకొచ్చారు. అయితే లేటెస్ట్‌గా మరో ట్వీట్‌(Tweet) చేసిన అనసూయ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారారు. ఈసారి హేటర్స్‌ను(Haters) ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ద్వేషాన్ని ఎదుర్కొని తాను ధైర్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ప్రస్తుతం అనసూయ చేసిన ట్వీట్స్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 'మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది.

ఎదుటివ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి, మీకు మీరు మంచి వాళ్లమని ఫీలవుతుంటారు. ఆ బాధపడిన వ్యక్తే స్ట్రాంగ్‌గా నిలబడితే మాత్రం తట్టుకోలేరు. ఇదే కదా కపటధోరణి అంటే. ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా నా జీవితంలో ముందుకెళ్తా. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే.. నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్‌ పొందాలనుకుంటారు.

బతికినంత కాలం చావాలనిపించేలా ట్రీట్‌ చేసి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.' అంటూ అనసూయ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత కూడా వరుసగా ట్వీట్స్‌ చేసుకుంటూ వెళ్లారు. 'ఏది ఏమైనా ఇప్పటికే నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరే నా బలం. శక్తి' అని ట్వీట్‌ చేసిన అనసూయ ఆ తర్వాత మరో ట్వీట్‌లో.. 'ఐ యామ్‌ సారీ.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్‌మీడియాలో మనం ఉండటానికి అసలు కారణం ఏమిటి? అటెన్షన్‌ పొందడం కోసం కాదా?’’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్‌ ఎంతమందికి అర్థమయ్యి ఉంటుందో తెలియదు కానీ సోషల్‌ మీడియాలో ఈ ట్వీట్స్‌పై చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది.

Updated On 21 Aug 2023 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story