ఇటీవ‌లే షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రాజెక్టు కె షూటింగ్‌లో ఈ చిత్రంలో అత్యంత ప్ర‌ధాన‌మైన కీల‌క‌పాత్ర‌ను పోషిస్లున్న జాతీయ మ‌హాన‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా వ‌చ్చిన వార్త‌ల‌ను చిత్రనిర్మాత అశ్వ‌నీ ద‌త్ చ‌ల‌సాని తీవ్రంగా ఖండించారు. షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ముగించుకుని, అమితాబ్ బ‌చ్చ‌న్ తిరిగి ముంబై క్షేమంగా చేరుకున్నార‌ని, ప్ర‌మాదానికి సంబంధించిన ఏ వార్త‌లోనూ నిజం లేద‌ని అశ్వ‌నీద‌త్ ఈహాకి తెలియ‌జేశారు. గ‌తంలో కూడా ఇదే విధంగా కొన్ని సామాజిక మాధ్య‌మాల‌లో కొన్ని […]

ఇటీవ‌లే షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రాజెక్టు కె షూటింగ్‌లో ఈ చిత్రంలో అత్యంత ప్ర‌ధాన‌మైన కీల‌క‌పాత్ర‌ను పోషిస్లున్న జాతీయ మ‌హాన‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్‌కి ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టుగా వ‌చ్చిన వార్త‌ల‌ను చిత్రనిర్మాత అశ్వ‌నీ ద‌త్ చ‌ల‌సాని తీవ్రంగా ఖండించారు. షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణంలో ముగించుకుని, అమితాబ్ బ‌చ్చ‌న్ తిరిగి ముంబై క్షేమంగా చేరుకున్నార‌ని, ప్ర‌మాదానికి సంబంధించిన ఏ వార్త‌లోనూ నిజం లేద‌ని అశ్వ‌నీద‌త్ ఈహాకి తెలియ‌జేశారు. గ‌తంలో కూడా ఇదే విధంగా కొన్ని సామాజిక మాధ్య‌మాల‌లో కొన్ని వార్త‌లు రావ‌డం జ‌రిగింద‌ని, అవ‌న్నీ కూడా నిరాధార‌మైన‌విగా తేలాయ‌ని కూడా ఆయ‌న అన్నారు. యావ‌త్తు భార‌త‌దేశంలొనే ప్ర‌స్తుతం ప్రాజెక్టు కె అత్యంత భారీ గా 500 కోట్ల బ‌డ్జెట్టుతో రూపొందుతోంద‌ని, ఇక మీద‌ట ఎటువంటి వార్త‌లు అందినా కూడా అవి స‌రైన‌వో కావో తెలుసుకుని మ‌రీ వార్త‌లు ప్ర‌చురించినా, ప్ర‌సారం చేసినా హుందాగా ఉంటుంద‌పనీ, ఆ విధంగా చేస్తే అంద‌రికీ గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఉండ‌డ‌మే కాకుండా, మ‌న మీడియా గౌర‌వం కూడా ఇనుమ‌డించిన‌ట్టు అవుతుంద‌ని అశ్వ‌నీద‌త్ అభిప్రాయ‌ప‌డ్డారు.

Updated On 6 March 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story