సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”

సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్”. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను, ప్రశంసలను అందుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రంగప్రవేశానికి సిద్ధమవుతోంది. ఆఫ్-సీజన్ ఫిబ్రవరిలో సినిమా విడుదల అయినప్పటికీ అంబాజీ పేట మంచి కలెక్షన్స్ రాబట్టిందనే చెప్పవచ్చు. ఎక్కువ మంది ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి మేకర్స్ OTT వైపు చాలా తొందరగానే అడుగులు వేశారు. ప్రముఖ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్, ఆహా వీడియో.. మార్చి 1 నుండి సినిమాను తమ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. మార్చి 1 నుండి మల్లితో డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి!.. అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్ మార్చి 1 నుండి ఆహాలో ప్రీమియర్‌ అవ్వనుంది అంటూ ఆహా పోస్టు పెట్టింది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. దుష్యంత్ కటికనేని రచించి దర్శకత్వం వహించిన సినిమా. సుహాస్‌తో పాటు శివాని నగరం, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ నటించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలేని ఎంటర్‌టైన్‌మెంట్‌పై ధీరజ్ మొగిలేని, వెంకట్ రెడ్డి నిర్మించారు. బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పించారు. కొన్ని సామాజిక అంశాలను ఎంతో గొప్పగా ఈ సినిమాలో చూపించారు.

Updated On 27 Feb 2024 12:38 AM GMT
Yagnik

Yagnik

Next Story