అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ద్వారా బాక్సాఫీసును షేక్ చేయబోతున్నారు

అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ద్వారా బాక్సాఫీసును షేక్ చేయబోతున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల కానుంది. పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా చాలా అంచనాలు, భారీ బజ్ ఉన్నాయి. అయితే వైసీపీ నంద్యాల ఎమ్మెల్యేకు అల్లు అర్జున్ మద్దతు కలిగించిన తర్వాత కొందరు పని గట్టుకుని అల్లు అర్జున్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. పనిగట్టుకుని అల్లు అర్జున్ ప్రతిష్టను దెబ్బతీస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినప్పటికీ.. కేవలం తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం వెళ్లడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు వెన్నుపోటు పొడిచారంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కావాలనే గత కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీకి, పవన్ కళ్యాణ్‌కి దూరంగా ఉంటున్నారని ప్రచారం చేస్తున్నారు. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టంగా అల్లు అర్జున్ చెప్పినా కూడా అల్లు అర్జున్ పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇక నాగబాబు ట్వీట్ విషయంలో కూడా ఇది బన్నీని టార్గెట్ చేసిందేనని అంటూ ఉన్నారు.

Updated On 15 May 2024 2:53 AM GMT
Yagnik

Yagnik

Next Story