ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సమయం దగ్గర పడగా.. మెగా హీరోలంతా జనసేన

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ సమయం దగ్గర పడగా.. మెగా హీరోలంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. పిఠాపురంలో సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. చిరంజీవి తన సోదరుడికి మద్దతుగా ఓ వీడియోను విడుదల చేశారు. రామ్ చరణ్ తల్లి సురేఖ, అల్లు అరవింద్‌లతో కలిసి పిఠాపురం సందర్శించారు. ఇలాంటి కీలక సమయంలో అల్లు అర్జున్ చేసిన చర్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. శనివారం అల్లు అర్జున్ తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేను కలిశాడు.. అల్లు అర్జున్ రాక కోసం భారీ జనసందోహం వచ్చింది. బన్నీ చేసిన ఈ చర్య పవన్ కళ్యాణ్ అభిమానులను, జనసేన మద్దతుదారులను తీవ్రంగా బాధించింది.

దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్, మెగా అభిమానుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలిపారు.. అయితే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఆయన నేరుగా నంద్యాలలో పర్యటించడం చాలా మందికి నచ్చలేదు. తన స్నేహితుడిని కలవడానికి కేవలం ట్వీట్ సరిపోదని.. అందుకే తన స్నేహితుడికి వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చానని చెప్పాడు. అయితే స్నేహితుడి కోసం ఇలా వచ్చిన అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ విషయంలో కేవలం సోషల్ మీడియా పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదని జనసేన మద్దతుదారులకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.

Updated On 12 May 2024 2:18 AM GMT
Yagnik

Yagnik

Next Story