టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు(Allu Arjun) అరుదైన గౌరవం దక్కబోతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తరువాత ఆ గౌరవం అల్లు అర్జున్ ను వరించబోతోంది.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు(Allu Arjun) అరుదైన గౌరవం దక్కబోతున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్స్ తరువాత ఆ గౌరవం అల్లు అర్జున్ ను వరించబోతోంది.

ప్రముఖ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక గుర్తింపు తో పాటు.. అరుదైన గౌరవం పొందబోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను సాధించిన ఐకాన్ స్టార్.. పుష్ప2 తో భారీ లక్ష్యాన్నిపెట్టుకున్నాడు. పుష్ప2ను వచ్చే ఏడాది అగస్ట్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు టీమ్. ఇక తన నటనతో బన్నీ ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఇక తాజాగా లండన్ లోని ప్రఖ్యాత మేడం తుస్సాడ్స్ మ్యూజియంలో బన్నీ మైనపు బొమ్మ(wax figure) పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.

ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్ మ్యూజియంలో(London Museum) కొలువై ఉన్నాయి. అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇక పుష్ప(Pushpa Movie) సినిమాకి గాను బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ ఫ్యాన్స్ తో పాటు పుష్పరాజ్ యాటిట్యూడ్ కి విదేశీయులు సైతం ఫిదా అయిపోయారు. కాగా.. పుష్ప క్యారెక్టర్ కి గాను బన్నీ ఇప్పటిదాకా ఎన్నో అవార్డులు అందుకున్నాడు.

రీసెంట్ పుష్ప సినిమాతో జాతీయ అవార్డ్ సాధించాడు అల్లు అర్జున్. తెలుగులో మొదటి సారి ఈ అవార్డ్ అందుకుంది కూడా బన్నీనే. ఈరకంగా కూడా అందుకోబోతున్నాడు అల్లు అర్జున్. నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. దీంతో మరోసారి బన్నీ పేరు వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యింది. అయితే.. ఇప్పుడు బన్నీ.. ప్రభాస్, మహేష్ బాబుల తరువాత స్థానంలో చేరినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలైనట్టు సమాచారం. అల్జు అర్జున్ త్వరలోనే లండన్ మ్యూజియాన్ని సందర్శించడంతోపాటు, మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Updated On 20 Sep 2023 2:47 AM GMT
Ehatv

Ehatv

Next Story