వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న పూజా(Pooja hegde) కెరీర్ ఒక్క సారిగా ప్రమాదంలో పడింది. చేసిన పాన్ ఇండియా సినిమాలన్నీ డిజాస్టర్స్ అవ్వడంతో.. లక్కీ హీరోయిన్ కాస్తా.. ఐరన్ లెగ్ గా మారిపోయింది. ఏ సినిమా చేసినా అది బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడుతుంది. అయినా సరే ఏం లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోతోంది బ్యూటీ.. క్రమంలో ఆమెకు లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న పూజా(Pooja hegde) కెరీర్ ఒక్క సారిగా ప్రమాదంలో పడింది. చేసిన పాన్ ఇండియా సినిమాలన్నీ డిజాస్టర్స్ అవ్వడంతో.. లక్కీ హీరోయిన్ కాస్తా.. ఐరన్ లెగ్ గా మారిపోయింది. ఏ సినిమా చేసినా అది బాక్సా ఫీస్ దగ్గర బోల్తా పడుతుంది. అయినా సరే ఏం లెక్క చేయకుండా ముందుకు దూసుకుపోతోంది బ్యూటీ.. క్రమంలో ఆమెకు లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

పాపం పూజ హెగ్డేకి కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో(Pan India Movie) నటిస్తూవచ్చిన ఈబ్యూటీని అదృష్టమంటే.. తనదే అన్నారు అంతా.. కాని ఆమె సాధించిన సినిమాలన్నీ.. వరుసగా ప్లాప్ అవుతూ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వచ్చాయి. దాంతో ఇప్పుడు పూజా ను ఐరన్ లెగ్ అంటున్నారు. ముఖ్యంగా ప్రభాస్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించి సినిమాలు కూడా దారుణంగా ప్లాప్ అవ్వడంతో పూజాపై నెగెటీవు టాక్ గట్టిగా స్ప్రెడ్ అయ్యింది. దాంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఇలా ఉంటే.. ఈలోపు మహేష్ బాబు జోడీగా మరోసారి మంచి ఛాన్స్ వచ్చింది పూజాకి. గుంటూరు కారంలో హీరోయిన్ గా తీసకున్నాడు త్రివిక్రమ్. కాని ఈసినిమా కూడా పూజాక కలిసి రాలేదు. షూటింగ్ డిలే అవ్వడంతో మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇక ఇంత జరుగుతున్నా.. అవేమి లెక్క చేయకుండా.. పూజా హెగ్డేకు ఛాన్స్ ఇచ్చాడట అల్లు అర్జున్(Allu arjun). జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' .. 'అల వైకుంఠపురములో'తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన త్రివిక్రమ్(Trivikram) - బన్నీ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది. ఈసినిమాలో హీరోయిన్ గా పూజాను పెడదామని అన్నాడట అల్లు అర్జున్. గతంలో వీరి కాంబోలో డిజె, అలవైకుంఠపురములో సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల్లో ఇద్దరి జోడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న 'గుంటూరు కారం' .. బన్నీ చేస్తున్న 'పుష్ప2' పూర్తి కాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.

Updated On 27 Sep 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story