మహేశ్‌బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కోసం సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడం, ఆర్ఆర్‌ఆర్‌(RRR) తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమాను తీయబోతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా ఇండియానా జోన్స్‌ లాగే ఉంటుందని చెప్పినప్పటికీ జానర్‌పై రోజుకో న్యూస్‌ వస్తున్నది.

మహేశ్‌బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కోసం సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరి కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడం, ఆర్ఆర్‌ఆర్‌(RRR) తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమాను తీయబోతున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా ఇండియానా జోన్స్‌ లాగే ఉంటుందని చెప్పినప్పటికీ జానర్‌పై రోజుకో న్యూస్‌ వస్తున్నది. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుందని కొందరంటుంటే, ఇంటర్నేషనల్‌ స్పై మూవీ అని మరికొందరు అంటున్నారు. రాజమౌళి మాత్రం పక్కా ప్లాన్‌తోనే సినిమాలు తీస్తారు. నటీనటుల ఎంపికలోనే రాజమౌళి మార్క్‌ కనిపిస్తుంది. పాన్‌ ఇండియా లెవల్లో సినిమాను విడుదల చేస్తారు కాబట్టి అన్ని భాషల నటులను తీసుకుంటారాయన! తాజా సినిమాలో మహేశ్‌బాబుతో పాటు హీరో నాగార్జున(Akkineni Nagarjuna) కూడా నటించనున్నారని వార్త! నాగార్జున ఇందులో కీలకపాత్ర పోషిస్తారని తెలుస్తోంది. హీరో నాగార్జునకు దర్శకుడు రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. ఇంతకు ముందు నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న సినిమాకు రాజమౌళి కొద్దిగా వర్క్‌ చేశాడు. ఆ సినిమాకు కథ- దర్శకుడు విజయేంద్ర ప్రసాదే! ఇప్పుడు మహేశ్‌బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు నిర్మాత కె.ఎల్‌.నారాయణ. నారాయణ ఇంతకు ముందు నాగార్జునతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే! నారాయణతో నాగ్‌కు మంచి రిలేషన్‌ ఉంది. ఇకపోతే నాగార్జునకు బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ ఉంది. గతంలో హీరోగా, సైడ్‌ హీరోగా చాలా సినిమాలు చేశాడు. పాన్‌ ఇండియా మూవీకి నాగ్‌ సరిగ్గా నప్పుతాడు. అధికారిక ప్రకటన వస్తే కానీ ఇది నిజమో కాదో తెలియదు.

Updated On 1 Feb 2024 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story