మంత్రి కొండా సురేఖ(Konda surekha) తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఇక్కడితో ఈ అంశాన్ని వదిలిపెట్టమని టీపీసీసీ చీఫ్‌ సినీ ఇండస్ట్రీకి రిక్వెస్ట్ చేసి గంటలు కూడా కాలేదు.

మంత్రి కొండా సురేఖ(Konda surekha) తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఇక్కడితో ఈ అంశాన్ని వదిలిపెట్టమని టీపీసీసీ చీఫ్‌ సినీ ఇండస్ట్రీకి రిక్వెస్ట్ చేసి గంటలు కూడా కాలేదు. మళ్లీ కొండా సురేఖ నోటి వెంట ఆ అసహ్యపు మాటలే వచ్చాయి. నాగచైతన్య, సమంతల విడాకులపై పిచ్చి ప్రేలాపనలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆమె చేయడంపై ప్రజలు చీదరించుకుంటున్నారు. మతిభ్రమించి మాట్లాడుతున్నారేమోనన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖను వదిలిపెట్టేలా లేరు నాగార్జున(Nagarjuna). ఆమెపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్లు సమాచారం. నిన్న నాంపల్లి కేసులో డిఫమేషన్ కేసు వేసిన నాగార్జున, రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారట.

Eha Tv

Eha Tv

Next Story