అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), పూరీ జగన్నాథ్‌(Puri Jaganath) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్నది. నా సామిరంగ చిత్రంతో హిట్‌ అందుకున్న నాగార్జున ఆ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు.

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), పూరీ జగన్నాథ్‌(Puri Jagannath) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రాబోతున్నది. నా సామిరంగ చిత్రంతో హిట్‌ అందుకున్న నాగార్జున ఆ ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. తమిళ టాప్‌ హీరో ధనుష్‌(Danush)-శేఖర్‌ కమ్ముల(Shekar Kammula) కాంబినేషన్‌లో వస్తున్న కుబేరా(Kubera) సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నాగార్జున తర్వాత నా సామిరంగ డైరెక్టర్‌ విజయ్‌ బిన్నితో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులతో పాటు మరో క్రేజీ ప్రాజెక్టుకు కూడా నాగ్‌ ఓకే చెప్పారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో శివమణి(shivamani), సూపర్‌(Super) సినిమాలు వచ్చాయి. రెండూ కమర్షియల్‌గా సక్సెస్‌ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి సినిమా రాబోతున్నది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ హీరో రామ్‌తో(Ram) డబుల్‌ ఇస్మార్ట్‌ను తీస్తున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌కు ఇది సీక్వెల్‌. ఈ సినిమా తర్వాత నాగ్‌తో సినిమా ఉండవచ్చు.

Updated On 24 May 2024 6:37 AM GMT
Ehatv

Ehatv

Next Story