మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ పతాకంపై అఖండను నిర్మించి భారీ విజయాన్ని సాధించింది

నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అఖండ చెప్పుకోవచ్చు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ఒక ఊపును ఊపేసింది. అఖండ ఘనవిజయం తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ త్వరలో అఖండ 2 కోసం మళ్లీ జతకట్టనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అల్లు అరవింద్ ప్రొడక్షన్‌లో రూపొందనుంది.

కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్- బోయపాటి శ్రీను సరైనోడు సినిమా తర్వాత పాన్-ఇండియా సినిమా కోసం చేతులు కలుపుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ ప్రాజెక్ట్ అఖండ 2 అని తెలుస్తోంది. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ పతాకంపై అఖండను నిర్మించి భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తూ ఉంది. బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా మార్చి నాటికి షూటింగ్ పూర్తి అవ్వనుంది. ఆ తర్వాత బాలకృష్ణ ఈ ఏడాది చివర్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారానికి విరామం తీసుకోనున్నారు. ఈ విరామం తర్వాత బాలయ్య తన అఖండ 2 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నాడు. అల్లు అరవింద్ చాలా కాలంగా బాలకృష్ణతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య-అల్లు అరవింద్‌లు ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో కోసం కలిసి పని చేశారు. ఇది భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు బాలయ్య, బోయపాటి, అల్లు అరవింద్‌ల సినిమా మీద భారీ అంచనాలు ఉండనున్నాయి.

Updated On 7 Feb 2024 10:23 PM GMT
Yagnik

Yagnik

Next Story