కొన్ని రోజులు క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు(Rajinikanth Daughter) ఐశ్వర్య(Aishwarya) రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగి.. ఈ విషయం తెగ వైరల్. ఇంట్లో జరిగిన దొంగ తనంలో దాదాపు 60 సవర్ల బంగారం పోవడంతో అది పెద్ద ఇష్యూగా మారింది. ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది ఐశ్వర్య. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి విస్తు పోయే నిజాలు బటకు తీశారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా ఉన్న ఇంట్లోని పని మనిషి అయిన ఈశ్వరిని అరెస్ట్ చేసి విచారించారు.

కొన్ని రోజులు క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు(Rajinikanth Daughter) ఐశ్వర్య(Aishwarya) రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగి.. ఈ విషయం తెగ వైరల్. ఇంట్లో జరిగిన దొంగ తనంలో దాదాపు 60 సవర్ల బంగారం పోవడంతో అది పెద్ద ఇష్యూగా మారింది. ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది ఐశ్వర్య. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేసి విస్తు పోయే నిజాలు బటకు తీశారు. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా ఉన్న ఇంట్లోని పని మనిషి అయిన ఈశ్వరిని అరెస్ట్ చేసి విచారించారు. ఇక అరెస్ట్ అయిన ఈశ్వరి విచారణలో వెల్లడించిన విషయాలు పోలీసులకు కూడా మతిపోయోలా చేశాయి.

ఇంట్లో పనిమనిషిగా ఉన్న ఆమెకు చెన్నై(Chennai)లో రెండు ఇళ్ళు ఉన్నాయట. అంతే కాదు తానే దొంగతనం చేసినట్టు ఒప్పుకున్న ఆమె.. తను అసలు దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యనే అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. మరి దొంగతనం చేయడానికి ఐశ్వర్య ఎందుకు కారణం అయ్యిందంటే..?

హీరో ధనుష్(Hero Dhanush)మాజీ భార్య.. రజనీకాంత్ గారాల కూతురు ఐశ్వర్య రజనీకాంత్.. తమిళనాట అందరికి సుపరిచితురాలే. మన టాలీవుడ్ లో కూడా సినిమా గురించి నాలెడ్జ్ ఉన్నవారికి ఆమె గురించి చెప్పనవసరం లేదు. ఇక ఆమె డైరెక్టర్ గా మూడు సినిమాలు కూడా చేశారు. ఇక తాజాగా ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ చోరీ కేసులో ఇంటి పని మనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగతం తనే చేసినట్లుగా అంగీకరించింది ఈశ్వరి. ఇక దొంగతనం ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించగా.. విస్తుపోయే విషయాలు వెల్లడించింది.

తాను ఈ ఇంట్లో గొడ్డులా పనిచేస్తున్నానని, అయినా సరే తనకు జీతం సరిగ్గా ఇవ్వడం లేదని. ఇచ్చేది కూడా కేవలం 30 వేలే ఇస్తున్నారని అన్నది. ఆ జీతం తన కుటుంబం గడవడానికి సరిపోట్లేదని, అందుకే దొంగతనం చేశానని ఈశ్వరి వెల్లడించింది. ఈ రకంగా ఇంట్లో దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యనే అంటుంది ఈశ్వరి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..? ఈశ్వరి ఇంట్లో.. ఇంకా ఎక్కువగా నగలు దొరికాయి. ఐశ్వర్య ఇంట్లో.. 60సవర్ల బంగారం తీసిన ఈశ్వరి ఇంట్లో.. 100 సవర్ల బంగారం కనిపించింది.

అంతే కాదు నాలుగు కేజీల వెండితో పాటు 30 గ్రాముల వజ్రాలు కూడా దొరికాయి. దాంతో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో అని విచారణ చేస్తున్నారు పోలీసులు . ఇక ఈ పనిమనిషి.. ధనుష్ ఇంట్లో.. రజనీకాంత్ ఇంట్లో కూడా పని చేసింది. ఒక వేళ అక్కడ తెలియకుండా దొంగిలించి ఉంటుందతి అని అనుమానం వ్యాక్త పరుస్తున్నారు.

Updated On 31 March 2023 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story