బాలీవుడ్‌లో(Bollywood) మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్ ఐశ్వర్యరాయ్(aishwarya rai), అభిషేక్‌ బచ్చన్(abhishek bachchan) అంటుంటారు. అయితే ఈ పవర్‌ఫుల్‌ జంట విడాకులు(Divorce) తీసుకోబోతున్నారని చాలా సార్లు వార్తలు వినిపించాయి. ఇందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. వీరి కూతురు ఆరాధ్య జన్మదిన వేడుకల్లో అభిషేక్‌బచ్చన్‌ కనిపించకపోవడంతో ఈ వార్తలు వచ్చాయి.

బాలీవుడ్‌లో(Bollywood) మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్ ఐశ్వర్యరాయ్(aishwarya rai), అభిషేక్‌ బచ్చన్(abhishek bachchan) అంటుంటారు. అయితే ఈ పవర్‌ఫుల్‌ జంట విడాకులు(Divorce) తీసుకోబోతున్నారని చాలా సార్లు వార్తలు వినిపించాయి. ఇందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. వీరి కూతురు ఆరాధ్య జన్మదిన వేడుకల్లో అభిషేక్‌బచ్చన్‌ కనిపించకపోవడంతో ఈ వార్తలు వచ్చాయి. ఐశ్వర్యరాయ్‌ పుట్టినరోజు సందర్భంగా లేట్ విష్‌ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ జంట కచ్చితంగా డివోర్స్‌ తీసుకోబోతున్నారన్న రూమర్లు గట్టిగానే వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా ఐశ్వర్యరాయ్‌ ఓ పోస్ట్ చేయడంతో వీరిద్దరి విడాకులపై క్లారిటీ వచ్చింది. తాజాగా తమ వివాహ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఐశ్వరరాయ్ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన భర్త అభిషేక్ బచ్చన్, గారాలపట్టి ఆరాధ్యతో ఉన్న ఫోటోను ఆమె షేర్‌ చేశారు. ఈ ఫొటోతో తమపై వస్తున్న విడాకుల రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయింది. దీంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2007 ఏప్రిల్ 20న వివాహాబంధంలోకి అభిషేక్-ఐశ్వర్య అడుగుపెట్టారు. 17 ఏళ్ల వీరి బంధానికి ఆరాధ్య అనే కూతురు జన్మించింది. ఇప్పటికే ఐశ్వర్య సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కానీ అభిషేక్ మాత్రం చివరిగా ఘూమర్‌ చిత్రంలో నటించారు.

Updated On 21 April 2024 1:23 AM GMT
Ehatv

Ehatv

Next Story