ఒకప్పుడేమోగానీ, ఇప్పుడున్న సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. గాడ్‌ఫాదర్లు ఉంటేనో, తాతలు, తండ్రులు సినిమా రంగంలో పాతుకుపోయినవారై ఉంటేనో ఈజీగా నిలదొక్కుకోగలరు. ఇక హీరోయిన్ల విషయం మరీ కష్టం. ఇప్పుడంతా హీరోయిన్ల గ్రామర్‌ ట్రెండ్‌ నడుస్తోంది. కథానాయికలు సినీ రంగ ప్రవేశం చేయాలన్నా,

ఒకప్పుడేమోగానీ, ఇప్పుడున్న సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. గాడ్‌ఫాదర్లు ఉంటేనో, తాతలు, తండ్రులు సినిమా రంగంలో పాతుకుపోయినవారై ఉంటేనో ఈజీగా నిలదొక్కుకోగలరు. ఇక హీరోయిన్ల విషయం మరీ కష్టం. ఇప్పుడంతా హీరోయిన్ల గ్రామర్‌ ట్రెండ్‌ నడుస్తోంది. కథానాయికలు సినీ రంగ ప్రవేశం చేయాలన్నా, మరీ ముఖ్యంగా నిలదొక్కుకోవాలన్నా ప్రతిభ ఒక్కటే సరిపోదు. కావాల్సినంత గ్లామర్‌ ఉండాలి. ఈ విషయాన్ని చాలా మంది హీరోయిన్లు బహిరంగంగానే ఒప్పుకుంటారు.

లేటెస్ట్‌గా హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi) కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. కేరళ(Kerala)కు చెందిన ఈ అందాల భామకు మొదట నటన మీద పెద్దగా ఆసక్తి లేదట! మెడిసిన్‌ చదివిన ఐశ్వర్య లక్ష్మి ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంపై దృష్టి సారించారట! అలా పలు వాణిజ్య సంస్థలకు మోడల్‌గా పని చేసిన ఐశ్వర్య లక్ష్మి ఫోటోలు పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురితమయ్యాయి. అవి చూసిన సినీ రంగ ప్రముఖులు ఐశ్వర్యలక్ష్మికి అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మొదట మలయాళ సినిమాల్లో నటించిన ఐశ్వర్యలక్షమి తర్వాత 2019లో విశాల్‌(Vishal) హీరోగా వచ్చిన యాక్షన్‌ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ చిత్రం పెద్దగా విజయం సాధించకపోవడంతో ఈమెకు అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అదే విధంగా ధనుష్‌(Dhanush)కు జంటగా నటించిన జగమే తంధిరం నేరుగా ఓటీపీలో స్ట్రీమింగ్‌ కావడంతో ఆ సినిమా కూడా ఐశ్వర్యలక్ష్మికి పెద్దగా గుర్తింపు తేలేదు. తర్వాత విష్ణు విశాల్‌ సరసన నటించిన గటా కుస్తీ సినిమాతో ఐశ్వర్య లక్ష్మి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు పిమ్మట మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో పూంగుళి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. సాయిపల్లవి నటించిన గార్గీ చిత్రం ద్వారా నిర్మాతగా మారారు.
తాజాగా దుల్కర్‌ సల్మాన్‌కు జంటగా కింగ్‌ ఆఫ్‌ కోత్త చిత్రంలో నటించారు. భారీ అంచనాల మధ్య పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం విజయం సాధించలేదు . దీంతో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు తగినట్లుగా గ్లామర్‌నే మార్గంగా ఎంచుకుంది. అందాలను ఆరబోస్తూ తీయించుకున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. అలాంటి ఫొటోల గురించి నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై ఐశ్వర్య లక్ష్మి స్పందిస్తూ గ్లామర్‌కు మారడం తప్పనిసరి అని అది లేకపోతే ఈ ఫీల్డ్‌లో కొనసాగలేమని పేర్కొన్నారు.

Updated On 18 Sep 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story