ఇండియన్‌ బాహుబలి ప్రభాస్‌ రాముడిగా టీ సిరీస్‌ ఓం రౌత్‌ దర్వకత్వంలో నిర్మించిన భారీ ఎత్తు చిత్రం ఆదిపురుష్ దాదాపుగా భారతదేశంలో ఎన్ని రకాల కాంట్రవర్సీలను, ఎన్ని రకాల ఆరోపణలను ఎదుర్కొందో మాటల్లో చెప్పడానికి వీలు లేదు. ఇండియాలో ముఖ్యంగా ఉత్తరాదిలో అన్ని రాష్ట్రాలలోనూ అన్ని న్యాయస్థానాలలోనూ ఆదిపురుష్‌ చిత్రం మీద కోర్టు కేసులు నడిచాయి. వాటన్నిటినీ కూడా చిత్ర యూనిట్‌ ఎంతో సంయమనంతో ఫేస్‌ చేసి, తమ వైపు నుంచి ఏ కోణంలోనూ తాము నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక దృశ్యకావ్యానికి అప్రతిష్ట కలుగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే వీటన్నిటినీ పబ్లిసిటీ స్టంట్‌ అని కొట్టి పారేసినవారు కూడా లేకపోలేదు. ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఈ తతంగమంతా జరిగిందని అన్నవాళ్ళు కూడా కోకొల్లలు.

Updated On 19 April 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story