బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వరభాస్కర్‌ సంచలనాలకు మారుపేరు. మీటూ ఉద్యమాన్న పతాకస్థాయికి తీసుకెళ్లినవారిలో స్వరభాస్కర్‌ కూడా ఒకరు. ఈ మధ్యనే ఈమె ఫహద్‌ అహ్మద్‌ అనే పొలిటిషియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. తర్వాత ఢిల్లీలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు స్వరభాస్కర్‌ను నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే స్వరభాస్కర్‌ బిడ్డకు జన్మనిచ్చిందన్నది ట్రోల్స్‌ సారాంశం.

బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వరభాస్కర్‌ (Swara Bhaskar) సంచలనాలకు మారుపేరు. మీటూ ఉద్యమాన్న పతాకస్థాయికి తీసుకెళ్లినవారిలో స్వరభాస్కర్‌ కూడా ఒకరు. ఈ మధ్యనే ఈమె ఫహద్‌ అహ్మద్‌ అనే పొలిటిషియన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొదట వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. తర్వాత ఢిల్లీలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు స్వరభాస్కర్‌ను నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే స్వరభాస్కర్‌ బిడ్డకు జన్మనిచ్చిందన్నది ట్రోల్స్‌ సారాంశం. వీటిపై స్వరభాస్కర్‌ ఇప్పటి వరకు రియాక్టవ్వలేదు. 'పెళ్లయిన నాలుగున్నర నెలలకే బిడ్డకు జన్మనిచ్చి తన పనిని ముందుగానే పూర్తి చేశారు.' అంటూ ఓ నెటిజన్‌ పోస్ట్‌ చేశారు. మరో నెటిజన్‌ 'పెళ్లయిన 3-4 నెలలకే స్వర భాస్కర్ తల్లి అయిన మాట నిజమేనా?’ అని రాసుకొచ్చాడు. కొందరు నెటిజన్లు మాత్రం స్వరభాస్కర్‌కు మద్దతుగా నిలిచారు. 2021 నవంబర్‌లో స్వరభాస్కర్‌ ఓ బిడ్డను దత్తత తీసుకోనున్నట్టు తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా శిఖా తల్సానియా, మొహర్‌ విజ్‌, పూజా చోప్రాలతో జహాన్‌ చార్‌ యార్‌ అనే సినిమాలో నటించింది. 2009లో వచ్చిన మధోలాల్‌ కీప్‌ వాకింగ్‌ సినిమాతో స్వరభాస్కర్‌ కెరీర్‌ మొదలయ్యింది. ఇందులో ఆమె ఓ సహాయ పాత్రలో నటించింది. థను వెడ్స్‌ మను, రాంఝనా, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో, నిల్‌ బట్టే సన్నట, అనార్కలి ఆఫ్‌ ఆరా, వీరే ది వెడ్డింగ్‌, షీర్‌ ఖోర్మా వంటి హిట్ సినిమాలలో నటించింది. తన తర్వాతి ప్రాజెక్ట్‌ మిసెస్‌ ఫలానీలో స్వరభాస్కర్‌ తొమ్మిది పాత్రలు పోషిస్తున్నారు.

Updated On 2 Jun 2023 3:23 AM GMT
Ehatv

Ehatv

Next Story