శ్రీ విష్ణు(Sree Vishnu) హీరోగా వచ్చిన సామజవరగమన(Samajavaragamana) సినిమాలో కథానాయికగా నటించిన రెబా మోనికా జాన్ (Reba Monica John) ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె సక్సెస్‌ను అందుకోవడంతో నిర్మాతల దృష్టి ఆమెపై పడింది. బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టిన రెబా మోనికా జాన్‌ ఉన్నత విద్యావంతురాలు..

శ్రీ విష్ణు(Sree Vishnu) హీరోగా వచ్చిన సామజవరగమన(Samajavaragamana) సినిమాలో కథానాయికగా నటించిన రెబా మోనికా జాన్ (Reba Monica John) ఇప్పుడు టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె సక్సెస్‌ను అందుకోవడంతో నిర్మాతల దృష్టి ఆమెపై పడింది. బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టిన రెబా మోనికా జాన్‌ ఉన్నత విద్యావంతురాలు.. మాస్టర్స్‌ చేసిందామె! చదువుకుంటున్నప్పుడే మోడలింగ్‌ చేసింది. అప్పుడే పలు యాడ్స్‌లోనూ నటించింది. 2016లో నివిన్‌ పాల్‌ హీరోగా వచ్చిన మలయాళ చిత్రం జాకోబింటే స్వర్గరాజ్యతో సినిమాల్లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతో హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా సినిమాలు చేస్తూ వచ్చింది. లాస్టియర్‌ జీమోన్‌ జోసెఫ్‌ను పెళ్లి చేసుకుంది. విజయ్‌ నటించిన బిగిల్‌లో ఓ ప్రధాన పాత్రను పోషించింది రెబా. యాసిడ్‌ దాడికి గురైనా సరే పట్టుదలగా ఫుట్‌బాల్‌ ఆడి తమ జట్టును గెలిపించే రోల్‌లో నటించింది. ఈ సినిమా తెలుగులో విజిల్‌ పేరుతో డబ్‌ అయ్యింది. అలా తెలుగువారికి కూడా పరిచయం అయ్యింది. ఇటీవలే నేరుగా ఓటీటీలో వచ్చిన బూ సినిమాలోనూ ఓ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో మాత్రం సామజవరగమన ఈమెకు ఫస్ట్ సినిమా. ఇందులో క్యూట్ గా యాక్ట్ చేసి అలరించింది. హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ ఈమెకు వరుసకు అక్క అవుతుందంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే విషయాన్ని రెబా మోనికా జాన్‌ దగ్గర ప్రస్తావించినప్పుడు అసలు సంగతి చెప్పింది. ' మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చాము, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారు. అది అలానే కంటిన్యూ అవుతూ వస్తోంది' అని రెబా తెలిపింది.

Updated On 1 July 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story