మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఉజ్జయినీ మహాకాళేశ్వరుడిని (Mahakaleshwar Temple) దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.

మధ్యప్రదేశ్‌లోని(Madhya Pradesh) ఉజ్జయినీ మహాకాళేశ్వరుడిని (Mahakaleshwar Temple) దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఆ దేవదేవుడి ఆశీస్సులు తీసుకోవడానికి ఉత్సాహపడుతుంటారు. మంగళవారం ఉదయం హీరోయిన్‌ రాశీఖన్నా(Rashi khanna), బాలీవుడ్‌ నటి వాణీకపూర్‌(Vani kapoor) ఆ మహేశ్వరుడిని దర్శించుకున్నారు. మహాకాళేశ్వరుడి తొలి పూజలు పాల్గొన్నారు. కాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ ఆదిదేవుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాశీఖన్నా అన్నారు. మహాకాళేశ్వరుడు తమను మళ్లీ పిలుస్తారని నమ్మకం ఉందన్నారు. ఉజ్జయినీ ఈశ్వరుడిని దర్శించుకోవడం గొప్ప అనుభూతి అని వాణీ కపూర్‌ అన్నారు.

Updated On 28 May 2024 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story