ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) కంట్లో నలుసులా తయారయ్యారు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌(Poonamkaur)..

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు(Pawan kalyan) కంట్లో నలుసులా తయారయ్యారు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌(Poonamkaur).. ప్రకాశ్‌రాజేమో డైరెక్ట్‌గా పవన్‌ను ఉద్దేశించే ట్వీట్లు పెడుతుంటే, పూనమ్ కౌరేమో ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌కు, ఆయన గురూజీ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు చురకలు పెడుతూ ఉంటారు. పూనమ్‌ కౌర్‌ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. తన వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకుంటూ సమకాలీన పరిస్థితుల పట్ల తనదైన శైలిలో రియాక్టవుతూ ఉంటారు. ముఖ్యంగా పవన్, త్రివిక్రమ్‌లపై ఆమె పెట్టే పోస్టులు ఇట్టే వైరల్‌ అవుతుంటాయి. తాజాగా పవన్‌ను విమర్శిస్తూ పూనమ్‌ ఓ ట్వీట్ చేశారు. పవన్‌ తిరుమల పర్యటనను ఆమె తప్పుపట్టారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్‌ తిరుమలకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ‘ప్రతి ఒక్కరికి కుమార్తె ముఖ్యమే’ అంటూ పూనమ్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. ఇది పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీటేనని ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

పనన్‌ కల్యాణ్‌ తన చిన్న కుమార్తె పొలెనా అంజనకి తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు. తర్వాత ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. నిజానికి భార్యకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్దంగా పవన్‌ కల్యాణ్‌ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. అలాగే నిషేధంలో ఉన్న వావనాలను కొండపైకి అనుమతి ఇస్తూ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం హాదాలో తిరుమలకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కల్పించడంపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. పవన్‌ కోసం సాధారణ భక్తులను గంటల కొద్ది క్యూలో నిలబెట్టడం సరికాదంటున్నారు నెటిజన్స్‌. పవన్‌ మెప్పు సంపాదించడం కోసం అధికారులు అత్యత్సాహం ప్రదర్శించారని అంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story