మంగళూరు అందాల భామ పూజా హెగ్డేకు(Pooja Hegde) ఇప్పుడు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్నది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల కిందట వరకు ఆమె తెలుగులో అగ్ర కథానాయిక. వరుస హిట్లతో దూసుకుపోయారు. విజయవంతమైన హీరోయిన్ కావడం వల్ల ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. అయితే సడన్‌గా ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలు పెట్టాయి.

మంగళూరు అందాల భామ పూజా హెగ్డేకు(Pooja Hegde) ఇప్పుడు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తున్నది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రెండేళ్ల కిందట వరకు ఆమె తెలుగులో అగ్ర కథానాయిక. వరుస హిట్లతో దూసుకుపోయారు. విజయవంతమైన హీరోయిన్ కావడం వల్ల ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. అయితే సడన్‌గా ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలు పెట్టాయి. మహేశ్‌బాబు(Mahesh) కథానాయకుడిగా త్రివిక్రమ్‌(Trivikram) తీస్తున్న గుంటూరుకారంలో(Guntur Karam) హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేనే అనుకున్నారు. కారణాలేమిటో తెలియదు కానీ ఆమెను సినిమా నుంచి తప్పించారు. హిందీలో నటిస్తున్నారు కాబట్టి తెలుగులో నటించడానికి ఆమెకు టైమ్‌ దొరకడం లేదనే సాకు చెప్పారు. ఇప్పుడు ఆమెకు మళ్లీ మునుపటి రోజులు వస్తున్నాయి. తెలుగులో ఈ బుట్టబొమ్మ మూడు సినిమాలకు సైన్‌ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూజాహెగ్డే కొన్ని కథల్ని వింటున్నారట. త్వరలో తెలుగు చిత్రాన్ని ప్రకటించబోతున్నారట. తమిళం, హిందీ నుంచి కూడా ఆఫర్లొస్తున్నాయట.
ఓ తెలుగు ప్రొడక్షన్‌ హౌస్‌తో ఆమె మూడు సినిమాల ఒప్పందం కుదుర్చోకోబోతున్నారు. అనుకోని కారణాల వల్ల కొన్ని సినిమాలను ఆమె వదులుకోవాల్సి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో తిరిగి ఆమెకు మంచి రోజులొస్తాయనే నమ్మకం ఉందంటున్నారు పూజా హెగ్డే సన్నిహిత వర్గాలు. మహేష్‌బాబు గుంటూరు కారం నుంచి ఈ భామ తప్పుకోవడంతో ఆ స్థానంలో శ్రీలీలను కథానాయికగా తీసుకున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే హిందీ సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.

Updated On 29 Sep 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story