పూజా హెగ్డే(Pooja Hegde) కొంతకాలం కిందటి వరకు తెలుగులో అగ్రశ్రేణి నటి. విజయవంతమైన సినిమాల్లో నటించిన కథానాయిక. ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. మహేశ్‌బాబు(Mahesh Babu), త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాలో హీరోయిన్‌ వేషం వచ్చినట్టే వచ్చి చేజారింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆమె బీజీ అవుతోంది.

పూజా హెగ్డే(Pooja Hegde) కొంతకాలం కిందటి వరకు తెలుగులో అగ్రశ్రేణి నటి. విజయవంతమైన సినిమాల్లో నటించిన కథానాయిక. ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. మహేశ్‌బాబు(Mahesh Babu), త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం(Guntur Kaaram) సినిమాలో హీరోయిన్‌ వేషం వచ్చినట్టే వచ్చి చేజారింది. మళ్లీ ఇప్పుడిప్పుడే ఆమె బీజీ అవుతోంది. హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తోంది. అదలా ఉంచితే యాక్షన్‌ కథల సినిమాల్లో నటించి తనేంటో రుజువుకు చేసుకోవాలన్నది పూజా హెగ్డే ఆకాంక్ష. కాకపోతే ఇప్పటి వరకు ఆమెకు ఆ ఛాన్స్‌ రాలేదు. తనకు యాక్షన్‌ సినిమాల్లో నటించాలని ఉందని ఇప్పటికి చాలా సార్లు చెప్పింది. ఆ మధ్యన పూరి జగన్నాథ్‌(Puri Jagannadh) దర్శకత్వంలో జనగణమన సినిమా(Jana Gana Mana Movie)లో యాక్షన్‌ పాత్ర చేసే అవకాశం లభించింది. కానీ ఆ సినిమా సెట్స్‌ మీదకు రాకముందే ఆగిపోయింది. అయితే ఇంతకాలం తర్వాత ఆమెకు తన కోరిక తీర్చుకునే అవకాశం లభించింది. ఇటీవల ఓ భారీ ప్రాజెక్టుకు ఆమె సైన్‌ చేసింది. అందులో ఆమె పాత్ర యాక్షన్‌ కోణంలోనే సాగనుందట. ఇందుకోసం పూజా హెగ్డే బాక్సింగ్‌, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నదట! జిమ్‌లో కఠిన కసరత్తులు చేస్తున్నారట! ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాబోతున్నది.

Updated On 7 Oct 2023 12:08 AM GMT
Ehatv

Ehatv

Next Story