జవాన్‌(Jawan) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara). గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమాలో నయనతార యాక్టింగ్‌కు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త విఘ్నేశ్‌ శివన్‌తో(Vignesh shivan) కలిసి ముంబాయిలోని ఓ థియేటర్‌లో చూశారు నయనతార. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

జవాన్‌(Jawan) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు లేడి సూపర్‌స్టార్‌ నయనతార(Nayanthara). గురువారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమాలో నయనతార యాక్టింగ్‌కు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భర్త విఘ్నేశ్‌ శివన్‌తో(Vignesh shivan) కలిసి ముంబాయిలోని ఓ థియేటర్‌లో చూశారు నయనతార. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. సినిమా చూసిన తర్వాత మీడియాతో నయనతార మాట్లాడారు. బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యిందని ఓ విలేకరి ప్రశ్నించినప్పుడు దేనికైనా సరైన సమయం రావాలన్నారు. కాస్త ఆలస్యమైనా తన అభిమాన హీరో షారుక్‌ ఖాన్‌ సినిమాతో బాలీవుడ్‌లో పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇకపై దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు కూడా సమాన ప్రాధాన్యమిస్తానని తెలిపారు. ఇదిలా ఉంటే జవాన్‌ సినిమాలో తన పాత్రకు తగినంత ప్రాముఖ్యత ఇవ్వలేదని దర్శకుడు అట్లీ(Atlee), నటుడు షారుక్‌ఖాన్‌ల(Shah Rukh Khan)పై నయనతార అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ రూమర్‌ వైరల్ అవుతోంది. నిజానికి జవాన్‌ సినిమాలో నయనతారకు ప్రాధాన్యతనిచ్చారు. ఆమెకు యాక్షన్‌ సన్నివేశాలు కూడా పెట్టారు. మరో విషయం ఏమిటంటే షారుక్‌ అంటే నయనతారకు ఎంతో ఇష్టం. భయంకరమైన అభిమాని. అట్లి దర్శకత్వం వహించిన మొదటి సినిమాలో నయనతారనే హీరోయిన్‌. తర్వాత తీసిన బిగిల్‌లో కూడా విజయ్‌ సరసన నయనతారనే నటించారు. ఇకపోతే జవాన్‌ చిత్రం సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేయడానికి నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ముంబై వెళ్లారు. ఈ జంటను ముంబాయి విమానాశ్రయంలో ఫొటో గ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే జవాన్‌ చిత్ర దర్శక నిర్మాతలపై నయనతార అసంతృప్తిగా ఉన్నట్టు వస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.

Updated On 9 Sep 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story