టెలివిజన్‌ యాంకర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన మాధవిలత తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2008లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత స్నేహితుడా, అరవింద్-2 వంటి సినిమాల్లో నటించారు మాధవిలత(Maadhavi Latha . మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా వచ్చిన అతిథి సినిమాలో హీరోయిన్‌ స్నేహితురాలిగా కనిపించారు.

టెలివిజన్‌ యాంకర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన మాధవిలత తర్వాత సినిమాల్లో అడుగుపెట్టారు. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. 2008లో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. తర్వాత స్నేహితుడా, అరవింద్-2 వంటి సినిమాల్లో నటించారు మాధవిలత(Maadhavi Latha . మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా వచ్చిన అతిథి సినిమాలో హీరోయిన్‌ స్నేహితురాలిగా కనిపించారు. తర్వాత మాధవిలతకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలో ఆమె పాలిటిక్స్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచూ పోస్టులు పెడుతుంటారు. ఫ్యాన్స్‌ పెట్టే కామెంట్లకు రియాక్టవుతుంటారు. లేటెస్ట్‌గా మాధవిలత బిగ్‌బాస్‌(Bigg Boss) షోపై కామెంట్స్‌ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో బిగ్‌బాస్‌పై చేసిన కామంట్లు సోషల్‌ మీడియా(Social Media)లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇన్‌స్టాలో ఆమె ఎమన్నారంటే ' 'బిగ్ బాస్ షో వంద శాతం కమర్షియల్. అందులో సామాన్యులను తీసుకోవాలి అనే డిమాండ్‌ ఓ సోది టాపిక్. సామాన్యులను పెడితే ఎవడూ దేకడు. టీఆర్పీ అస్సలు రాదు. అందుకే పిచ్చి ఆలోచనలు మానేసి చూసేటోళ్లు చూడండి. అంతే. ఎవడిని పెడితే దేకుతారో వాళ్లనె పెడతారు. ఈ సీజన్‌ కోసం చాలా మందిని ట్రై చేశారు. మీ పైసలు, మీ పబ్లిసిటీ మాకొద్దు. మాకు ఇజ్జత్ ముఖ్యం అంటూ మస్తు మంది బిగ్‌బాస్‌కు బైబై అన్నారు ఆ షోకి! అందుకే ఉన్నావాళ్లతో అడ్జస్ట్ అవ్వండి. నన్ను చూడమని అడగొద్దు. థ్యాంక్‌ యూ' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించి చేసిందో అర్థం కావడం లేదు. ఈ సీజన్‌లో సామాన్యుని కేటగిరీలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మాధవిలత చేసిన ఈ పోస్ట్ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Updated On 18 Sep 2023 2:52 AM GMT
Ehatv

Ehatv

Next Story