పవన్‌కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్లు!

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) ఇటీవల చేస్తున్న ట్వీట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ మూడు ముక్కల్లో చెప్పాల్సిందంతా చెప్పేస్తారు. ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పడు ఓ మీటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను(Pawan kalyan) ఉద్దేశింఇచ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు విసిరారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi) పాల్గొన్న డీఎంకే(DMK) సభలో ప్రకాశ్‌రాజు కూడా పాల్గొన్నారు. 'కొంతమంది నన్ను అడిగారు. ఎందుకు మీకు అంత తెగింపు, ఏం చూసుకొని మీ ధైర్యం అని. నేను ఒకటే చెబుతున్నా, నిజం మాట్లాడ్డానికి ధైర్యం ఎందుకు? ఉన్నదే కదా నేను చెబుతున్నాను. బస్సుల్లో మనం చూస్తుంటాం, దొంగలున్నారు జాగ్రత్త అని రాసి ఉంటుంది. అది చూసి దొంగ చాలా ఫీలవుతాడు. దొంగ ఫీలవుతాడని రాయకుండా ఉండలేం కదా. నేను కూడా అంతే. చెప్పాల్సింది చెబుతాను. నా వాక్ స్వాతంత్రాన్ని దొంగిలించొద్దు, నా ఉనికిని దొంగిలించొద్దు, నా గౌరవాన్ని దొంగిలించొద్దు అని బోర్డులు పెట్టాలని ఉంది. అలా పెడితే కొంతమంది దొంగల మనోభావాలు దెబ్బతింటాయేమో!' అని ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. కొనసాగింపుగా 'మనకు ఓ డిప్యూటీ సీఎం (ఉదయనిధి) ఉన్నాడు. ఆయన సమానత్వం గురించి మాట్లాడతాడు. ఇంకో డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు. ఆయన దీనికి భిన్నంగా సనాతనం పేరుతో మాట్లాడతాడు. కానీ మనందరం సమానంగా ఉందాం' అని ప్రకాశ్‌రాజ్‌ పేర్కన్నారు.

Eha Tv

Eha Tv

Next Story