రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో కొన్ని పొరపాట్లు జరిగాయని.. హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటవికి సబంధించిన కంప్లైయింట్స్ ఇప్పటికే సెన్సార్ బోర్డ్ కు చేరాయి. మరి ఈక్రమంలో రిలీజ్ వరకూ.. రిలీజ్ తరువాత కూడా ఆదిపురుష్ ఇంకెన్ని కాంట్రవర్సీలను ఫేస్ చేస్తుందో చూడాలి మరి.

ఆదిపురుష్(adhipurush) సినిమాలో రాముడిగా(Lord Ram) నటిస్టున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas).. భద్రా చల సీతారామస్వామి(Sitharamaswamy) దేవస్థానానికి భారీ విరాళం అందించారు.

భద్రాచలంలోని(Badhrachalam) శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి పాన్ ఇండియా హీరో.. ప్రభాస్‌ 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు(Uppalapati Suryanarayana raju) పేరిట ఈ విరాళం మొత్తాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన 10లక్షల చెక్కును ప్రభాస్‌ తరఫున ఆయన బంధువులు శనివారం దేవస్థానం ఈవో ఎల్‌. రమాదేవికి అందజేశారు. అయితే ఈ విరాళాన్ని అన్నదానం, గోశాలకు సంబంధించిన వాటికి వాడబోతున్నట్టు దేవస్థానం అధికారులు తెలియజేశారు.

ప్రస్తుతం ప్రభాస్ ఓం రౌత్ (Om Raut)డైరెక్షన్ లో.. ఆది పురుష్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇక ఈసినిమా వరుస వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో..ఆదిపురుష్ రిలీజ్ వరకూ ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయా అన్న సందేహంలో ఉన్నారు సినిమా టీమ్. ఇప్పటికే టీజర్ వల్ల వచ్చిన నెగెటివిటీని..ట్రైలర్ తో పోగొట్టుకున్నారు టీమ్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. భారీ బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ప్రపంచా వ్యాప్తంగా భారీ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.

ఈక్రమంలో ఆదిపురుష్ సినిమాకు ఎటువంటి ఆటంకాలు రాకుండా శ్రీరాముడికి మొక్కుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమా గండం గట్టెక్కి.. సూపర్ హిట్ అయితే.. ప్రభాస్ రాములోరి దర్శనానికి వస్తారా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరో వైపు ఆదిపురుష్ ను పై ఇప్పటికే పలు కంప్లైట్ లు రాగా.. రీసెంట్ గా సెన్సార్ బోర్డ్ కు మరో కంప్లైంట్ వెళ్లింది. రాయాయణాన్ని వాళ్ళకు తగ్గట్టు మార్చి..గ్రాఫిక్స్ ఆడ్ చేసి.. పిచ్చిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ.. సినిమా రిలీజ్ కు ముందే తమకు చూపించాలంటూ హిందూ సంఘాలు పిటీషన్లు వేస్తున్నాయి.

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో కొన్ని పొరపాట్లు జరిగాయని.. హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీటవికి సబంధించిన కంప్లైయింట్స్ ఇప్పటికే సెన్సార్ బోర్డ్ కు చేరాయి. మరి ఈక్రమంలో రిలీజ్ వరకూ.. రిలీజ్ తరువాత కూడా ఆదిపురుష్ ఇంకెన్ని కాంట్రవర్సీలను ఫేస్ చేస్తుందో చూడాలి మరి. రాముడిగా ప్రభాస్ నటించగా.. సీతగా ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ కృతి సనన్ నటించింది. రావణ బ్రహ్మగా..సైఫ్అలీ ఖాన్ నటించారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున జూన్ 30న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మూవీ టీమ్.

Updated On 14 May 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story