భోజ్‌పురి సినీ నటిపై అత్యాచారం జరిగింది. ఇంటర్వ్యూ పేరుతో ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో(Gurugram) జరిగింది. ప్రస్తుతం బాధితురాలు ఢిల్లీలో నివసిస్తున్నారు. 24 ఏళ్ల ఆ సినీనటికి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ద్వారా నిందితుడు ఫ్రెండయ్యాడట! బాధితురాఇకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉందని పోలీసులు అంటున్నారు.

భోజ్‌పురి సినీ నటిపై అత్యాచారం జరిగింది. ఇంటర్వ్యూ పేరుతో ఆమె స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో(Gurugram) జరిగింది. ప్రస్తుతం బాధితురాలు ఢిల్లీలో నివసిస్తున్నారు. 24 ఏళ్ల ఆ సినీనటికి ఆమె ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ద్వారా నిందితుడు ఫ్రెండయ్యాడట! బాధితురాఇకి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్‌ ఉందని పోలీసులు అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన వీడియోలను క్రమ తప్పకుండా పోస్ట్ చేస్తుంటారని తెలిపారు. కొన్ని రోజుల కిందట ఆమెకు భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మహేశ్‌పాండే(Mahesh Pandey) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

జపూన్‌ 29న అతడు ఇంటర్వ్యూ పేరుతో గురుగ్రామ్‌లోని ఉద్యోగ విహార్‌ ప్రాంతంలోని హోటల్‌కు ఆమెను పిలిచాడు. అతడి మాటలు నమ్మి ఆమె హోటల్‌కు వెళ్లారు. ఆమె హోటల్‌కు వెళ్లక ముందే అక్కడ ఓ గదిని బుక్‌ చేశాడు మహేశ్‌ పాండే. ఆ గదిలోకి ఆమెను తీసుకెళ్లారు. ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతడు మద్యం తాగడం మొదలు పెట్టాడు. అది చూసి ఆమె అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. లేచి వెళ్లిపోతుండగా మహేశ్‌ పాండే ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాలన్నీ పోలీసులకు తెలిపారు హీరోయిన్‌. పైగా అత్యాచార విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తానని బెదిరించడాని ఆ నటి తెలిపారు. ఆ ఘటన తర్వాత అతని స్నేహితులు కొందరు తనకు ఫోన్‌ చేసి, తన ప్రైవేటు వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తామని బెదిరించారని ఆమె తెలిపారు. గురుగ్రామ్‌లోని చకర్‌పూర్‌ ప్రాంతంలో ఉండే మహేశ్‌ పాండేపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated On 21 July 2023 1:07 AM GMT
Ehatv

Ehatv

Next Story