బిగ్‌బాస్‌ సీజన్‌ -8(Bigg boss) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

బిగ్‌బాస్‌ సీజన్‌ -8(Bigg boss) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ పాపులర్‌ రియాల్టీ షోకు ఈసారి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ప్రోమో విడుదలయ్యింది. అయితే ఇప్పటి వరకు పార్టిసిపెంట్లు ఎవరనేది బయటపెట్టలేదు. కాకపోతే కొన్ని రోజులుగా కొన్ని పేర్లు మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హౌస్‌లోకి వెళ్లే ఆ 14 మంది ఎవరనేది దాదాపుగా తెలిసిపోయింది. నైనిక, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, యష్మీ గౌడ, బేబక్క, విష్ణుప్రియ, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్, కిరాక్ సీత, సోనియా, ప్రేరణ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఎనిమిదో సీజన్‌ లిమిట్‌లెస్‌ అని నాగార్జున చెప్పారు కాబట్టి అందుకు తగ్గట్టే కంటెస్టెంట్స్‌ని సోలోగా కాకుండా జోడీలుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్‌ చేశారు. అలాగే విడుదల చేసిన ప్రోమోలో సరిపోదా శనివారం జంట నాని-ప్రియాంక, 35 చిన్న కథ కాదు సినిమా ప్రమోషన్ కోసం రానా, నివేదా థామస్‌ వచ్చారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా సందడి చేశాడు. ఈ రోజు సాయింత్రం 7గంటలకు స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ ప్రసారం కానుంది.

Eha Tv

Eha Tv

Next Story