Longest Night of the Year: ఇవాళ్టి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది!
ఈ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంది. సంవత్సరంలో అతి తక్కవ పగటి సమయం(Solstice)ఉండే రోజు ఇదే....!

ఈ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంది. సంవత్సరంలో అతి తక్కవ పగటి సమయం(Solstice)ఉండే రోజు ఇదే....! అంటే ఈ రోజు భూమి అత్యంత సుదీర్ఘమైన రాత్రిని చూడబోతుంది. సాధారణంగా ఒక రోజు అంటే.. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు పగలు ఎక్కువగా ఉండటం, రాత్రుళ్లు తక్కువగా ఉండటం.. పగలు తక్కువగా ఉండి, రాత్రుళ్లు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలా జరిగడాన్ని అయానంతం.(సోల్స్టీస్)అంటారు. అలాంటి రోజు ఈ రోజు (డిసెంబర్ 21) . ఈ రోజున పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటోంది. ఇలా ఎందుకు జరుగుతుంది?
సూర్యుడు మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యధిక లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని చుట్టూ భూమి కక్ష్యలో ఉండే రెండు బిందువులను అయనాంతం అంటారు. దీని ఫలితంగా సంవత్సరంలో అతి పొడవైన రోజు (వేసవి కాలపు అయనాంతం), అతి తక్కువ రోజు (శీతాకాలపు అయనాంతం) వస్తుంది. ఇది ఏటా రెండుసార్లు జరిగే ఘట్టం.ఇక పగలు సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉండే పరిస్థితిని శీతాకాలం అయానంతం ( వింటర్ సోల్స్టీస్ ) అంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం డిసెంబరు 19 నుంచి 23 మధ్యలో ఏదో ఒక రోజు జరుగుతుంది. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుంచి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది. అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ సమయం ఉంటుంది. ఇక ఈ రోజున భూమి దాని ధ్రువం వద్ద 23.4 డిగ్రీల వంపులో ఉంటుంది.ఈ రోజు అత్యంత తక్కువగా పగలు 8 గంటలు, సుదీర్ఘమైన రాత్రిగా చంద్ర కాంతి 16 గంటల వరకు ఉంటుంది...
అయనాంతంపై అనేక నమ్మకాలు ఉన్నాయి. శీతాకాలంలో ఏర్పడే అయనాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలురకాల నమ్మకాలను పాటిస్తుంటారు. చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధమతంలోని యన్, యాంగ్ శాఖకు చెందిన ప్రజలు ఈరోజును ఐక్యత, శ్రేయస్సుకు ప్రతీకగా నమ్ముతూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించి, గీతాపారాయణం చేస్తారు. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో పుష్య మాస పండగను ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు అయనాంతం నుంచి మొదలవుతుంది. అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది...
