రంగారెడ్డి జిల్లా (Rangareddy Dist) అత్తాపూర్‌లో (Attapur) విషాదం చోటు చేసుకుంది. పండగ పూట ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. సంక్రాంతి సెలవుల సందర్భంగా దోస్తులతో సరదాగా గడపాలని అనుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా (Rangareddy Dist) అత్తాపూర్‌లో (Attapur) విషాదం చోటు చేసుకుంది. పండగ పూట ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. సంక్రాంతి సెలవుల సందర్భంగా దోస్తులతో సరదాగా గడపాలని అనుకున్నాడు. గాలిపటం ఎగరవేసేందుకు వెళ్లిన బాలుడు విద్యుత్‌ షాక్‌తో (Electric Shock) మృతి చెందాడు. పతంగి ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు తగిలి తనిష్క్‌ (Tanishq) అనే 11 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. బిడ్డను కోల్పోయిన ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నవయసులో మృతి చెందడంతో ఈ పరిసరాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Updated On 13 Jan 2024 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story