ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ప్రతిపక్ష పార్టీ దూరంగా ఉంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ ఇవాళ ప్రకటించారు.

ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలకు బల్మూరి వెంకట్ (Balmuri Venkat) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ప్రతిపక్ష పార్టీ దూరంగా ఉంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్సీ పదవులకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ (Assembly Secretary) ఇవాళ ప్రకటించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ గౌడ్, వెంకట్‌లకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి (Kadiam Srihari) , పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో అనివార్యంగా వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. పాడి, కడియం రాజీనామాలకు మండలి చైర్మన్ ఆమోదం తెలపడంతో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా రెండు స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే ఛాన్స్ వచ్చింది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఇవాళ సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. అయితే.. ఇప్పటి వరకు పోటీలో ఎవరూ లేకపోవడంతో అసెంబ్లీ కార్యాలయం బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్‌లను ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించింది.

 
Updated On 22 Jan 2024 7:38 AM GMT
Ehatv

Ehatv

Next Story