ప్రేమ పేరుతో ఓ మైనర్‌ బాలికను స్కూల్‌ టీచర్‌ మోసం చేశాడు. అంతేకాదు ఆ బాలికను కిడ్నాప్‌ చేసి, తాళి కట్టాడు. పెళ్లి చేసుకున్నాని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆలస్యం ఈ విషయం బయటకు పొక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రేమ (Love) పేరుతో ఓ మైనర్‌ బాలిక (Girl) ను స్కూల్‌ టీచర్‌ (School Teacher) మోసం చేశాడు. అంతేకాదు ఆ బాలికను కిడ్నాప్‌ చేసి, తాళి కట్టాడు. పెళ్లి చేసుకున్నాని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి (West Godavari)జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆలస్యం ఈ విషయం బయటకు పొక్కింది. పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం (Bhimavaram) మండలం తాడేరు గ్రామానికి చెందిన సోమరాజు (Soma Raju) అనే వ్యక్తి అదే జిల్లాలోని మరో మండలంలో ఉన్న ఓ స్కూల్‌లో హిందీ (Hindi)టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల బాలికపై కన్నేశాడు. భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సినవాడు ఆ బాలిక భవిష్యత్‌నే దెబ్బకొట్టాడు. విద్యాపాటాలు నేర్పాల్సిన టీచర్‌ ప్రేమ పాటాలతో (Love Lessions) మోసం చేశాడు. ఈనెల 19న తన బైక్‌(Byke)పై ఆ మైనర్‌ బాలికను ఎక్కించుకొని సోమరాజు తాడేరుకు తీసుకెళ్లాడు. తాడేరులోనే బాలిక మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సోమరాజుపై అత్యాచారం, పోక్సో (POCSO), బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ (Disha) డీఎస్పీ (DSP) ఎన్‌.మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ (SP) రవిప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారు.

Updated On 23 Nov 2023 3:06 AM GMT
Ehatv

Ehatv

Next Story