షర్మిలపై (Sharmila) మాజీ ఎంపీ హర్షకుమార్‌ (Harsha Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ (AP Congress) బాధ్యతలు షర్మిలకు అప్పగించొద్దని హర్షకుమార్‌ అన్నారు.

షర్మిలపై (Sharmila) మాజీ ఎంపీ హర్షకుమార్‌ (Harsha Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ (AP Congress) బాధ్యతలు షర్మిలకు అప్పగించొద్దని హర్షకుమార్‌ అన్నారు. షర్మిలకు పీసీసీ అధ్యక్ష ఇస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందన్న ఆయన.. కావాలంటే షర్మిలకు జాతీయస్థాయి పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న షర్మిల ఏపీలో ఎలా చెల్లుబాటు అవుతుందని హర్షకుమార్‌ ప్రశ్నించారు. వైఎస్ జగన్ (YS Jagan), షర్మిల ఇద్దరూ ఒకటే, మోడీ (Modi) వెనుక జగన్, సోనియా (Sonia) వెనుక షర్మిల వెళ్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా సేఫ్‌గా ఉండాలని అన్నా, చెల్లి ప్లాన్‌ వేసుకున్నారని హర్షకుమార్‌ ఘాటుగా విమర్శించారు.

Updated On 11 Jan 2024 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story