వచ్చే అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో తనకు టికెట్‌ రాదని ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా(Roja) మండిపడ్డారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ(TDP), జ‌న‌సేన‌(Janasena), ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమ‌ర్శించారు.

వచ్చే అసెంబ్లీ(Assembly) ఎన్నికల్లో తనకు టికెట్‌ రాదని ప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా(Roja) మండిపడ్డారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ(TDP), జ‌న‌సేన‌(Janasena), ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమ‌ర్శించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరిగినా ముందు వరుసలో ఉండేది తానే అన్నారు. నేను సీఎం జగనన్న(CM Jagan) సైనికురాలినని.. ఆయ‌న‌ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం.. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటాన‌ని.​‍​‍. మిషన్ -2024లో 175/175లో భాగం అవుతానని స్ప‌ష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో(Election) తాను పోటీ చేస్తానని.. జగనన్న మాటే తనకు శిరోధార్యమని పేర్కొన్నారు. సీఎం జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.

పవన్‌(Pawan Kalyan), చంద్రబాబు(Chandrababu) ఎక్కడ పోటీ చేయాలో తెలియక రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.

Updated On 19 Dec 2023 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story