తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)ను ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం రాత్రి ప్రజాభవన్ కు వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబసభ్యులతో కలిసి భట్టి విక్రమార్క స్వాగతం పలికారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)ను ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం రాత్రి ప్రజాభవన్ కు వచ్చిన చిరంజీవి దంపతులకు కుటుంబసభ్యులతో కలిసి భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం భట్టీకి చిరంజీవి శాలువా కప్పి, బొకే ఇవ్వగా..ఆ తర్వాత చిరంజీవి దంపతులను పుష్పగుచ్చం, శాలువాతో భట్టి విక్రమార్క సత్కారించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి వరుసగా నాయకులను కలుస్తున్నారు. వారం రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి ఆయన బావమరిది అల్లు అరవింద్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం టాలీవుడ్ హైదరాబాద్ లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగింది.ఇదే సమయంలో ప్రభుత్వానికి తెలుగు సినిమా రంగం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందంట. కాగా నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కుతో చిరంజీవి దంపతులు భేటీ కావడం జరిగింది.

Updated On 4 Jan 2024 11:32 AM GMT
Ehatv

Ehatv

Next Story