ఎల్బీనగర్‌లో (Lb Nagar) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు రాంగ్‌ రూట్‌లో వెళ్లి సీఐ నడుపుతున్న బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు చార్మినార్ (Charminar) ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ సీఐ (Excise Police Station CI) సాదిక్ (Sadiq Ali)అలీగా గుర్తించారు.

ఎల్బీనగర్‌లో (Lb Nagar) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు రాంగ్‌ రూట్‌లో వెళ్లి సీఐ నడుపుతున్న బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు చార్మినార్ (Charminar) ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ సీఐ (Excise Police Station CI) సాదిక్ (Sadiq Ali)అలీగా గుర్తించారు. గాయపడిన వ్యక్తి నారాయణగూడ (Narayanaguda) ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఖాజావలీ మోహినుద్దీన్‌గా (Khajavali Mohinuddin) గుర్తించారు. సీఐ సాదిక్ అలీ, ఎస్ఐ ఖాజావలీ మోహినుద్దీన్ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. ఎల్బీనగర్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లి మలక్‌పేట్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నాయి. వినుషా శెట్టి (Vinusha Shetti) అనే పేరుతో కారు రిజిస్ట్రేషన్ ఉంది. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్స్ కూడా ఉన్నాయి. రోడ్డు ప్రమాదం తర్వాత డ్రైవర్‌ కారును వదిలేసి పరారయ్యారు. కారును నడుపిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated On 14 Feb 2024 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story