తూర్పుగోదావరి జిల్లాలో  (East Godavari) మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి (Devarapally) మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి (Devarapally) మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కారు టైరు పేలి డివైడర్ అవతలి వైపు మార్గంలో వెళ్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తున్న గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు (MLA Talari Venkata Rao) పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు (Kovvuru) ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రి ఆవరణలో మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated On 2 Jan 2024 6:52 AM GMT
Ehatv

Ehatv

Next Story