ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీసీ కన్‌స్ట్రక్చన్ /ఎంటీ-అదర్స్) 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది . దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను మార్చి 14 వరకు సమర్పించాలి. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల 42 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది. ఈ పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయస్సు జనరల్ కేటగిరీకి 25 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ […]

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీసీ కన్‌స్ట్రక్చన్ /ఎంటీ-అదర్స్) 42 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది . దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను మార్చి 14 వరకు సమర్పించాలి. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల 42 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.

ఈ పోస్టులకు అభ్యర్థుల గరిష్ట వయస్సు జనరల్ కేటగిరీకి 25 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ engineersindia.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు గేట్-2023 పరీక్షలో హాజరైన ప్రకటనలో తెలిపిన విధంగా సంబంధిత విభాగాల నుంచి గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు అయి ఉండాలి. అధికారిక వెబ్‌సైట్‌ engineersindia.comను లాగిన్ అవ్వండి.

Updated On 7 March 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story