వై.ఎస్‌.వివేకానందరెడ్డి(Y.S Vivekananda R eddy) వ్యక్తిగత జీవితంపై అసత్యాలతో కూడిన కథనాలను కొన్ని మీడియా(Media) సంస్థలు ప్రసారం చేస్తున్నాయని వైఎస్‌ఆర్‌ టిపీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్‌.షర్మిల(Y.S Sharmila) మండిపడ్డారు. వివేకాపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు.

వివేకాపై(Viveka) మీడియా(Media) దుష్ప్రచారాలు చేస్తోంది : షర్మిల మండిపాటు

వై.ఎస్‌.వివేకానందరెడ్డి(Y.S Vivekananda R eddy) వ్యక్తిగత జీవితంపై అసత్యాలతో కూడిన కథనాలను కొన్ని మీడియా(Media) సంస్థలు ప్రసారం చేస్తున్నాయని వైఎస్‌ఆర్‌ టిపీ(YSRTP) అధినాయకురాలు వై.ఎస్‌.షర్మిల(Y.S Sharmila) మండిపడ్డారు. వివేకాపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. వివేకా తన అన్ని ఆస్తులను ఎప్పుడో సునీత పేరు మీద రాశారని, ఆస్తి కోసం సునీత(Sunitha) ఎందుకు నాన్నను చంపుతుందని ప్రశ్నించారు. ఒకవేళ సునీత భర్తే ఈ పని చేశారనుకున్నా, ఆయన మొదట చంపాల్సింది సునీతనేనని, ఎందుకంటే ఆస్తి మొత్తం సునీత పేరిటే ఉన్నాయని చెప్పారు. మన మధ్య లేని వ్యక్తిపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. ప్రజల కోసమే పని చేసిన నాయకుడు వివేకానందరెడ్డి అని, అలాంటి మంచి మనిషి గురించి కొందరు విష ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని మీడియాలు పనిగట్టుకుని చెడుగా చెబుతున్నాయని, మీడియాలకు విలువలు ఉండాలని, విలువలు లేని రోజున విశ్వసనీయతను కోల్పోతాయని షర్మిల పేర్కొన్నారు.

Updated On 26 April 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story