కరీంనగర్‌కు చెందిన 27 ఏళ్ల షహబాజ్‌ ఖాన్‌ సౌదీ అరేబియాలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయాడు.

కరీంనగర్‌కు(Karimnagar) చెందిన 27 ఏళ్ల షహబాజ్‌ ఖాన్‌ సౌదీ అరేబియాలోని(Saudhi arabia) ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయాడు. అల్‌ హాసాలో ఓ టెలిఫోన్‌ కంపెనీలో టవర్‌ టెక్నిషియన్‌గా(Tower technician) పని చేస్తున్న ఆ యువకుడు అయిదు రోజుల కిందట విధి నిర్వహణలో భాగంగా సుడాన్‌ దేశానికి సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. జీపీఎస్‌ లోకేషన్‌ ఆధారంగా కారు నడుపుతూ వెళితే అక్కడికి చేరారు. అది ఎంత ప్రమాదకరమైన ప్రదేశమో వారికి తెలియదు. దాన్ని ఖళీ క్వార్టర్‌ అంటారు. అరబిక్‌ భాషలో రబ్‌ అల్‌ ఖలీ. ఈ ఏడారిలో దారితప్పితే మరణమే దిక్కు. కారులో పెట్రోల్‌తో పాటు కడుపులో తిండి, నీళ్లు కూడా అయిపోయాయి. చివరకు మొబైల్‌ ఛార్జింగ్‌ కూడా అయిపోయింది. జీవితంపై ఆశలు అడుగంటిపోయిన ఆ ఇద్దరు కారు దగ్గరే ఇసుకలో చాప పరుచుకుని నమాజ్‌ చేస్తూ చనిపోయారు. వీరి గల్లంతుపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు హెలికాప్టర్ల సాయంతో గాలించి.. నమాజ్‌ చేసే చాపపై పడి ఉన్న మృతదేహాలను కనుగొన్నారు.

Eha Tv

Eha Tv

Next Story