గ్రహాంతరవాసులు(Aliens) ఉన్నారా? ఉంటే మనలాగే ఉంటారా? ఈ సందేహం బుద్ధి వికసించినప్పటి నుంచి మనల్ని వెంటాడుతూనే ఉంది.

గ్రహాంతరవాసులు(Aliens) ఉన్నారా? ఉంటే మనలాగే ఉంటారా? ఈ సందేహం బుద్ధి వికసించినప్పటి నుంచి మనల్ని వెంటాడుతూనే ఉంది. కొన్ని దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎనిమిదో దశకంలో అగ్రరాజ్యాలు అమెరికా(America), సోవియట్‌ రష్యాకు(Russia) చెందిన ఎంతో మంది పరిశోధన చేశారు. కొన్నేళ్ల కిందటి వరకు గ్రహాంతరవాసులు కేవలం ఊహాజనితమైన జీవులు. అయితే కొందరి అనుభవాలను పరికిస్తే, కొన్ని పరిశోధనలను పరిశీలిస్తే గ్రహాంతరవాసుల జాడ కచ్చితంగా ఉందనిపిస్తోంది. గ్రహాంతర వాసులకు సంబంధించిన సమాచారాన్ని అగ్రరాజ్యాలు మాత్రం ఎందుకో దాచి పెడుతున్నాయన్నది పరిశోధకుల అనుమానం.

రష్యాకు చెందిన నేవీ అధికారులు(Navy Officers) గ్రహాంతరవాసులను ప్రత్యక్షంగా చూశారు. అందుకు సంబంధించిన ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఇప్పటి వరకు పుతిన్‌ ప్రభుత్వం దానిని బయటపెట్టలేదు. అయితే కొందరు అధికారుల ద్వారా అసలు విషయం లీక్‌ అయ్యింది. 2009 జులై మాసంలో రష్యా నావికాదళానికి చెందిన ఓ సబ్‌ మెరైన్‌(submarine) సముద్ర గర్భంలో ప్రయాణిస్తోంది. సడన్‌గా డిస్క్‌ ఆకారంలో ఉన్న ఆరు వస్తువులు అత్యంత వేగంగా సబ్‌ మెరైన్‌ పక్క నుంచి వెళ్లిపోయాయి. వాటిని పైలట్‌ గమనించాడు. నీట గర్భంలోనే గంటకు 256 మైళ్ల వేగంతో ప్రయాణించడం చూసి సబ్‌ మెరైన్‌ పైలట్‌ ఆశర్యపోయాడు. భయపడ్డాడు కూడా! వెంటనే విషయాన్ని సబ్‌మెరైన్‌లోని ఇతర సిబ్బందికి చెప్పాడు.

వారికి కూడా భయం పట్టేసుకుంది. ఆ ఆకారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరివి? అని కంగారుపడ్డారు. విష్ణు చక్రాల్లా దూసుకుపోయిన ఆ ఆరు ఆకారాలు మళంలీ సబ్‌ మెరైన్‌కు దగ్గర నుంచి వెళ్లిపోయాయి. పైలట్‌కు భయం పట్టుకుంది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సబ్ మెరైన్ ను అమాంతం నీటి ఉపరితలానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత చూస్తే ఆ ఆరు వస్తువులు కూడా వేగంగా నీటి ఉపరి తలానికి దూసుకొచ్చాయి. తర్వాత గాల్లోకి ఎగిరి ఆకాశంవైపు వెళ్లిపోయాయి. అవి కచ్చితంగా గ్రహాంతరవాసులు ప్రయాణించే స్పేస్‌షిప్‌లు(spaceship) కావచ్చని నేవీ అధికారులు భావిస్తున్నారు. గగనంలో ఎగడమే కాదు, నీటిలోనూ దూసుకుపోతున్నాయంటే గ్రహాంతరవాసుల టెక్నాలజీ ఎంత అడ్వాన్స్‌గా ఉందో అర్థమవుతున్నది.

గ్రహాంతరవాసులను చూసిన సంగతిని నేవీలోని ఇతర సహచరులకు సబ్‌మెరైన్‌ సిబ్బంది చెప్పారు. చాలా మంది ఆ విషయాన్ని నమ్మలేదు. తర్వాత వారు దానిపై ఓ నివేదిక రూపొందించి ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఈ నివేదికను రష్యా ప్రభుత్వం చాలా రహస్యంగా దాచిపెట్టింది. బయటపెడితే కలిగే నష్టమేమిటో తెలియడం లేదని పరిశోధకులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనకు 27 సంవత్సరాల ముందు, అంటే 1982లో సైబీరియా ప్రాంతంలో గ్రహాంతరవాసులు కనిపించారు. బైకాల్ సరస్సులోకి ఏడుగురు డైవర్లు దూకి నీటి అడుక్కి వెళ్లారు. 50 మీటర్ల దూరం వెళ్లే సరికి వారికి తమని ఎవరో గమనిస్తున్నారన్న అనుమానం వచ్చింది. వెనక్కి తిరిగి చూసిన డైవర్లకు గుండెలు గుభేలుమన్నాయి.

భయంతో బిక్కచచ్చిపోయారు. కారణం వారిని భారీ పరిమాణంలో ఉన్న ఓ వింత ఆకారం చూస్తుండటమే! మనిషి పోలికలతో ఉన్న ఆ ఆకారం హెల్మెట్‌ వంటి పరికరాన్ని ధరించి ఉందట! ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి వింత మానవ ఆకారాలు వారికి కనిపించాయి. వాటికి మనలాగే కాళ్లు చేతులు ఉన్నాయి. కాకపోతే అవి తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్నాయి. డైవర్లు ధైర్యం చేసి ఓ ఆకారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించారు కానీ వారికి ఆ శక్తి చాలలేదు. ఆ వింత ఆకారం డైవర్లను అమాంతం నీటి ఉపరితలం వైపుకు చాలా బలంగా నెట్టేసింది.

ఆ ఆకారాలకు అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో డైవర్లకు అర్ధం కాలేదు. ఆ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నీటి కింద ఆక్సిజన్ సిలెండర్ల అవసరం లేకుండా ఆ జీవులు ఎలా ఉండగలుగుతున్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. గడ్డ కట్టుకుపోయే నీటిలోనూ ఆ జీవులు ఎలా మనుగడ సాగిస్తున్నాయో అర్థమవ్వడం లేదు అవి కచ్చితంగా ఏదో ఓ గ్రహం నుంచి వచ్చిన గ్రహాంతర వాసులేనని డైవర్లు భావిస్తున్నారు. వారు తాము చూసింది అధికారులకు వివరించారు. దాన్ని ఓ నివేదిక గా రూపొందించారు. ఇది కూడా రష్యాప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంది. ఏదో బలమైన కారణంతోనే రష్యా ప్రభుత్వం ఆ నివేదికలను బహిర్గత పర్చడం లేదని సైంటిస్టులు భావిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story