ఈమధ్య పాకిస్థాన్‌లో అత్యాచారాలు (Rapes)బాగా పెరిగిపోయాయి. అక్కడ ప్రతీ 2 గంటలకు ఓ మహిళపై రేప్ జరుగుతోంది. పాకిస్థాన్‌లో శవాలతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. దీన్నే నెక్రోఫిలియా (necrophilia) అంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి.. శవాలు నచ్చుతాయి. సమాధులను పగలగొట్టి మరీ శవాల్ని ఎత్తుకుపోతారు. సెక్సువల్ ఇంటర్‌కోర్స్‌కి పాల్పడతారు.

పాకిస్థాన్‌లో (Pakistan) ఓ వార్త అక్కడ వారిని కలవర పెడుతోంది. అక్కడ బతికివున్నవారికే కాదు ...చనిపోయిన వారి శవాలకు కూడా భద్రత లేదు. స్వయంగా అమ్మాయిల తల్లిదండ్రులే(parents).. సమాధులకు తాళాలు వేస్తున్నారు. బహుశా ప్రపంచంలో ఇలాంటి వార్తను మనం ఎప్పుడూ విని ఉండము. కానీ దీనికి పాకిస్థాన్ ( pakistan) కేంద్రం అయ్యింది.. కానీ తల్లిదండ్రులు.. తమ కూతుర్ల సమాధులకు తాళాలు వేస్తున్నారు. సమాధిని తవ్వి లేదా శవాన్ని టచ్ చేసే ఛాన్స్ కూడా లేకుండా... బలమైన ఇనుప ఊచలతో తాళాలు వేస్తున్నారు.

ఇది నిజంగా షాకింగ్ విషయమే అని చెప్పుకోవాలి. ఇలా ఎక్కడా, ఎవ్వరూ చేసి ఉండరు. కానీ కరువు ప్రాంతంలా మారిన పాకిస్థాన్‌లో ఇలా చేస్తున్నారు. కారణం ఏంటంటే.. ఈమధ్య పాకిస్థాన్‌లో అత్యాచారాలు (Rapes)బాగా పెరిగిపోయాయి. అక్కడ ప్రతీ 2 గంటలకు ఓ మహిళపై రేప్ జరుగుతోంది. పాకిస్థాన్‌లో శవాలతో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. దీన్నే నెక్రోఫిలియా (necrophilia) అంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి.. శవాలు నచ్చుతాయి. సమాధులను పగలగొట్టి మరీ శవాల్ని ఎత్తుకుపోతారు. సెక్సువల్ ఇంటర్‌కోర్స్‌కి పాల్పడతారు. ఇదే ఇప్పుడు ఆ దేశాన్ని కుదిపేస్తోంది. చాలా చోట్ల మహిళలు, యువతుల శవాలు మాయమవుతున్నాయి. కొన్నిచోట్ల శవాలపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లభిస్తున్నాయి.

మన దేశంలో లాగానే... పాకిస్థాన్‌లో ( pakistan)కూడా కుటుంబ విలువలు అత్యున్నతంగా ఉంటాయి. మహిళలకే కాదు.. వారి శవాలకు ఏ చిన్న తప్పు జరిగినా.. ఆ దేవుడు తమను క్షమించడనీ.. ఆ శాపం వెంటాడుతుందని నమ్ముతారు. అలాంటి దేశంలో.. మహిళలకే కాదు.. శవాలకు భద్రత లేదని స్పష్టమవుతోంది ఇప్పుడు. పాకిస్తాన్ ఇలాంటి లైంగిక వాంఛలు, నిరాశతో కూడిన సమాజాన్ని సృష్టించింది. ప్రజలు ఇప్పుడు వారి ఆడపిల్లలు అత్యాచారానికి గురికాకుండా... వారి సమాధులకు తాళాలు(Locks)వేస్తున్నారు. పాకిస్థాన్‌లో నెక్రోఫీలియాని ఆపే పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ అమ్మాయి సమాధి మాయమవుతుందో తెలియని పరిస్థితి. శవాలను కాపాడుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని స్థితిలో ఉన్నారు పేరెంట్స్.

పాకిస్తాన్ సృష్టించిన సామాజిక వాతావరణం... లైంగిక వేధింపులు, అణచివేతకు గురైన సమాజానికి దారితీసింది. ఇక్కడ కొంతమంది వ్యక్తులు తమ కుమార్తెలను( daughters) లైంగిక హింస నుంచి రక్షించడానికి వారి సమాధులకు తాళాలు వేస్తున్నారు. నిరాశతో నిండిన వారు... ఇలాంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు. పాకిస్థాన్‌లో 2011లో ఓ భయంకరమైన నెక్రోఫిలియా కేసు బయటపడింది. కరాచిలోని నార్త్ నాజిమాబాద్‌గకి చెందిన మహ్మద్ రిజ్వాన్..శ్మశాన కాపరిగా ఉంటూ... 48 మహిళా శవాలను రేప్ చేసినట్లు తేలడంతో అతన్ని అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో జాతీయ మానవ హక్కుల సంఘం ప్రకారం.. 40 శాతం మంది మహిళలు ఏదో ఒక రకమైన లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇలా ఆర్థికంగా, సామాజికంగా, విలువల పరంగా... అన్ని రకాలుగా ఆ దేశం పాతాళానికి పడిపోతోంది.

Updated On 29 April 2023 4:52 AM GMT
madhuri p

madhuri p

Next Story