మహిళలపై ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు.

వీధి కుక్కలు(street dog) ఓ పసికందు ప్రాణం తీశాయి. నిజామాబాద్‌(nizamabad) జిల్లా బోధన్‌లో(Bodhan) కలకలం రేపింది ఈ ఘటన! చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై(baby) కుక్కల గుంపు దాడి చేసింది. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి పీక్కుతిన్నాయి. బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. బోధన్‌లో ఓ మహిళ యాచకురాలికి పది నెలల కొడుకు ఉన్నాడు. కొడుకును బస్టాండ్‌ సమీపంలో ఓ చెట్టు కింద ఉంచి మూత్రశాలకు వెళ్లింది. తిరిగి వచ్చి చూస్తే కొడుకు కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం ఉదయం కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. వారికి సమీప ప్రాంతంలో చిన్నారి శరీరభాగాలు దొరికాయి. వాటిని సేకరించి, బాలుడిని కుక్కలు చంపేసి పీక్కుతిన్నట్టు నిర్ధారించారు. అనంతరం దొరికిన మాంసం ముద్దలను బోధన్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

Eha Tv

Eha Tv

Next Story