కొండంత ఆశతో అమెరికాకు(america) వెళుతున్నారు కానీ అదేం భద్రమైన దేశమేమీ కాదు.

కొండంత ఆశతో అమెరికాకు(america) వెళుతున్నారు కానీ అదేం భద్రమైన దేశమేమీ కాదు. ఇటీవల కాలంలో భారత సంతతి వ్యక్తులపై వరుసగా దాడులు జరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని కాల్చి చంపారు దుండగులు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఆగ్రాకు చెందిన 29 ఏళ్ల గావిన్‌ దసౌర్‌(Gavin Dasaur) అనే వ్యక్తి కొన్నేళ్ల కిందట అమెరికాకు వెళ్లి సెటిలయ్యాడు. మొన్నీమధ్యనే గావిన్‌ దసౌర్‌కు మెక్సికోకు(Mexico) చెందిన వివియానా జమౌరాతో పెళ్లయ్యింది. భార్యతో సరదాగా బయటకు వెళుతున్నప్పుడు కారుకు యాక్సిడెంట్‌ అయ్యింది. వెంటనే గావిన్‌ దౌసర్‌ తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని కారు నుంచి కిందకు దిగాడు. వెనుక వాహనంలోఉన్న డ్రైవర్‌తో గొడవపడ్డాడు. ఆ డ్రైవర్‌కు కూడా కోపం వచ్చేసింది. తన దగ్గర ఉన్న తుపాకీతో దసౌర్‌పై కాల్పులు జరిపాడు. మెడకు బుల్లెట్‌ తగలడంతో గావిన్‌ దసౌర్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గాయపడిన దౌసర్‌ను అతడి భార్య హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. చికిత్స తీసుకుంటూ అతడు కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్టు కోర్టుకు నిందితుడు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Eha Tv

Eha Tv

Next Story