ఒమన్ రాజధాని నగరం మస్కట్‌లోని అలీ బిన్ అబీ తాలిబ్ మసీదుపై జరిగిన దాడిలో మరణించిన ఆరుగురిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు

ఒమన్ రాజధాని నగరం మస్కట్‌లోని అలీ బిన్ అబీ తాలిబ్ మసీదుపై జరిగిన దాడిలో మరణించిన ఆరుగురిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రాణనష్టం గురించి తెలియజేసింది. జూలై 16 రాత్రి జరిగిన ఈ తుపాకీ దాడిలో మరొక భారతీయుడు కూడా గాయపడ్డాడని పేర్కొంది. ఈ ఘటన సోమవారం రాత్రి అల్ వాడి అల్ కబీర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఈ సంఘటనపై మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం.. “జులై 15న మస్కట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో.. ఒమన్ సుల్తానేట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయాడని.. మరొకరు గాయపడ్డారని తెలియజేసింది. రాయబార కార్యాలయం తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. కుటుంబాలకు అన్ని సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. ఒమన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. దాడికి పాల్ప‌డిన‌ ముగ్గురు దుండ‌గులు మరణించారు. మరణించిన వారిలో నలుగురు పాకిస్థానీలు, ఒక పోలీసు ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన కనీసం 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆరోగ్య సంస్థలకు తరలించామని.. ఘటన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story