తమ ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయే సరికి ప్రియుడితో కలిసి ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది.

తమ ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయే సరికి ప్రియుడితో కలిసి ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. భోజనంలో విషం కలిపి సొంతింటి వాళ్లందరిని చంపేసింది. పాకిస్తాన్‌(Pakistan)లో సింధ్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌లోని ఖైర్‌పూర్‌(Khairpur) సమీపంలో హైబత్‌ఖాన్‌ బ్రోహి(Haibat Khan Brohi) గ్రామంలో ఆగస్టు 19వ తేదీన ఒకే కుటుంబంలోని 13 మంది చనిపోయారు. అనుమానం వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సొంత కూతురే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుసుకుని షాక్‌ అయ్యారు పోలీసులు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో కసి పెంచుకున్న ఆ యువతి ఈ పాతకానికి ఒడిగట్టింది. రాత్రి భోజనంలో విషం కలిపి ఇంట్లో వాళ్లకు పెట్టింది. ఆ భోజనం తిన్న వారందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వారంతా చనిపోయారు. పోస్ట్‌మార్టం నివేదికలో వారు విషపూరిత ఆహారం కారణంగా మరణించినట్లు తేలడంతో ఖైర్‌పూర్‌ పోలీసులకు అనుమానం వచ్చింది. ప్రియుడితో కలిసి ఆ యువతి ఇంట్లో రొట్టెలు చేయడానికి ఉపయోగించే గోధుమపిండిలో విషం కలిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతిని, ఆమెకు సహకరించిన అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ehatv

ehatv

Next Story