కూతురు పుట్టి రెండు వారాలయ్యిందంతే..! అప్పుడే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.

కూతురు పుట్టి రెండు వారాలయ్యిందంతే..! అప్పుడే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి. నిండేటట్టు చేశాడు కన్నతండ్రి. ఆ శిశువును బతికుండానే పాతిపెట్టాడు. పాకిస్తాన్‌లోని(Pakistan) సింధ్‌(sindh) ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడ నివసిస్తున్న తయ్యబ్‌ అనే వ్యక్తికి కూతురు పుట్టింది. అయితే పుట్టుకతోనే ఆ పాపకు ఓ వ్యాధితో బాధపడుతోంది. బిడ్డకు చికిత్స చేయించడానికి తండ్రి దగ్గర డబ్బుల్లేవు. ఏం చేయాలో పాలుపోలేదా తండ్రికి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆ పాపను బతికుండగానే పాతిపెట్టాడు. ఈ విషయం ఎలాగోలా పోలీసులకు తెలిసింది. తయ్యబ్‌ను అరెస్ట్ చేసి విచారించినప్పుడు విషయం చెప్పాడు తయ్యబ్‌. కోర్టు ఆదేశాలతో పోలీసులు సమాధిని తవ్వి , ఆ పసికందు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌ మార్టంకు పంపించారు.

Eha Tv

Eha Tv

Next Story